రాంచీ వేదికగా జేఎస్సీఏ స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్స్ లో రెండో రోజు లంచ్ విరామం తరువాత అస్ట్రేలియా అలౌట్ అయ్యింది. దీంతో విరాట్ సేన ఎదుట 451 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అసీస్ జట్టులో కెప్టెన్ స్టీవ్ స్మిత్, జ్లెన్ మాక్స్ వెల్ మినహా ఎవరూ అంతగా రాణించలేదు. అయినా అసీస్ భారీ స్కోరును అతిథ్య జట్టు ముందు ఉంచగలిగింది. ముఖ్యంగా అసీస్ కెప్టెన్ స్మిత్ 178 పరుగలతో అజేయంగా రాణించి కెప్టెన్ ఇన్నింగ్స్ అడాడు.
నాలుగు వికెట్ల నష్టానికి 299 పరుగల ఓవర్ నైట్ స్కోరుతో ఇవాళ్టి అటను ప్రారంభించిన అసీస్ భారీ స్కోరుకు కెప్టెన్ స్మిత్.. మాక్స్ వెల్ మధ్య ఏర్పడిన చక్కని భాగస్వామ్యమే కీలకంగా మారింది. దీంతో 2103లో భారత్ తో జరిగిన టెస్టు మ్యచ్ లోనే టెస్టు క్రికెట్ లోకి అరంగ్రేటం చేసిన అసీస్ బ్యాట్స్ మెన్ జ్లన్ మాక్స్ వెల్ తన టెస్టు క్రికెట్ కెరీర్లో తొలి శతకం నమోదు చేశాడు. అనంతరం నాలుగు పరుగులు జోడించిన మ్యాక్స్వెల్ను 104 పరుగల వద్ద జడేజా పెవిలియన్కు పంపాడంతో భారీ దిశగా సాగుతున్న అసీస్ స్కోరుబోర్డుకు బ్రేక్ పడింది. ఫలితంగా 191 పరుగుల వద్ద ఈ బాగస్వామ్యానికి తెరపడింది.
ఆసీస్ బ్యాట్స్మెన్లలో రెన్షా 44, వార్నర్ 19, మార్ష్ 2, హెచ్.కాంబ్ 19, వాడే 37, కమ్మిన్స్ 0, ఓకీఫ్ 25, లియాన్ 1, హెచ్.వుడ్ 0 పరుగులు చేసి అవుట్ కాగా కెప్టెన్ స్మిత్ మాత్రం 178 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జెడేజా మరోమారు ఐదు వికెట్లను పడగోట్టాడు. భారత బౌలర్లలో జడేజా 5, ఉమేశ్ యాదవ్ 3, అశ్విన్ 1 వికెట్లు తీశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more