టైం బాగోలేక జైల్లో ఉండాల్సి వచ్చింది గానీ లేకపోతే చిన్నమ్మ తమిళనాట రాజకీయ చక్రం సులువుగా తిప్పేదే!. ఎలాగైతేనేం తన మద్ధతుదారుడంటూ పళనీస్వామిని సీఎంగా నిలబెట్టి పంతం నెగ్గించుకుంది శశికళ. అయితే ఆమె విషయంలో మాత్రం పార్టీ ఇంకా తీవ్ర ఆందోళనకు గురవుతూనే ఉంది. అందుకు కారణం ఆమెపై ఇంకా ప్రజా వ్యతిరేకత అలాగే ఉండటం. దీంతో పార్టీ ఆమె క్రేజ్ ను వాడుకునేందుకు జంకుతుంది.
అక్రమాస్తుల కేసులో దోషిగా ఉన్న ఆమె పేరును వాడుకుంటే ఎక్కడ మొదటికే మోసం వస్తుందోనని వెనకంజ వేస్తున్నారు. ఎందుకొచ్చిన గొడవంటూ ఆమె మద్ధతుదారులే ఫొటోలను కూడా వాడటం లేదు. రీసెంట్ గా దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా కోవిలంబాక్కంలో సంక్షేమ పథక సహాయాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందుకోసం పల్లావరం-తురైపాక్కం రోడ్డులో శశికళ వర్గీయులు పెద్ద ఎత్తున భారీ బ్యానర్లను ఏర్పాటు చేశారు. అయితే వాటిలో ఎక్కడా శశికళ ఫొటో కానీ, పేరు కానీ లేకుండా జాగ్రత్త పడ్డారు.
స్పీచ్ లలో కూడా పొరపాటున ఆమె ప్రస్తావన రాకుండా, ఎక్కడా ఫొటో ప్రింట్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఫొటో లేకుండానే ప్రజల్లోకి వెళ్లడం మంచిదని చివరికి వీరాభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారంట. ఇంకోవైపు రెండాకుల గుర్తు చేజారకుండా కీలక నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు కూడా.
మేనత్త సెంటిమెంట్ తోనే దీప...
జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావిస్తున్న జయ మేనకోడలు దీప తనకు కోడిపుంజు గుర్తును కేటాయించాలని ఈసీని అభ్యర్థించనుందంట. అందుకు కారణం లేకపోలేదు. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీఆర్ మరణానంతరం పార్టీలో చీలిక ఏర్పడినప్పుడు, జయ వర్గానికి ఈసీ కోడిపుంజు గుర్తునే కేటాయించింది. అందుకే అదే సెంటిమెంట్తో ఎన్నికలకు వెళ్లేందుకు దీప మొగ్గు చూపుతోంది. అలాకానీ పక్షంలో చేప, త్రాసు, శ్రామికుల చేయి గుర్తులలో ఏదో ఒకదాని కోసం పట్టుబట్టాలని నిర్ణయించుకున్నారు. వచ్చే నెల 12 ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయగా, నామినేషన్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more