మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతంరం ఖాళీ అయిన ఆర్కే నగర్ (రాధాకృష్ణన్) నియోజకవర్గానికి వచ్చే నెల (ఏప్రిల్) 12న ఉపఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా జయకు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో సరైన వారసులు ఎవరో తెలే ఎన్నికలు కావటంతో అందరి చూపు ఇప్పుడు అక్కడే ఉంది. అయితే జయ లేని లోటును వాడుకుని తాము లాభపడాలని మిగతా పార్టీలన్నీ తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఓపక్క ‘జయ జిరాక్స్’ మేనకొడలు అయిన దీప జయకుమార్, మరోపక్క జయలలిత ఆశయాలు సాధించే వ్యక్తినంటూ చెప్పుకుంటున్న పన్నీరు సెల్వం, ఇంకోపక్క సీఎం పళనిస్వామి కూడా పార్టీ అభ్యర్థులను నిలబెట్టనున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో విజయం సాధించడం ద్వారా జయలలిత మద్దతుదారులు శశికళ వెంట లేరని నిరూపించాలని మరోపకాక్ డీఎంకే భావిస్తోంది. ఇంతలో సందట్లో సడేమియా అన్న చందాన తాము కూడా పోటీకి సిద్ధమంటూ డీఎండీకే పార్టీ ప్రకటించింది.
ఈ విషయాన్ని నటుడు, ఆ పార్టీ అధ్యక్షుడు అయిన విజయకాంత్ స్వయంగా తెలిపాడు. అయితే గతంలో అరవకుర్చి, తంజావూరు, తిరుప్పరంకుండ్రం ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఘోరపరాజయం పొంది, కనీసం డిపాజిట్ కూడా డీఎండీకే సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో విజయ్ కాంత్ నిర్ణయం పై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లను చీల్చటం ద్వారా అయినా పూర్తి మెజార్టీ ఎవరికీ దక్కకుండా చేయాలని ప్రతీ పార్టీ యత్నిస్తున్నట్లు పరిణామాలు చూస్తే అర్థమైపోతుంది. డీఎండీకే తరపున కార్యదర్శకులు మదివానన లేదా అబ్దుల్లాను బరిలో దించనున్నట్టు తెలుస్తోంది.
ఇక పురుచ్ఛితలైవి మేనకోడలు దీపకు తీవ్ర ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేస్తే ఆమెను చంపేస్తామని కొందరు రౌడీలు బెదిరింపునకు దిగారంట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. పార్టీ ప్రకటించాక తనపై వేధింపులు ప్రారంభమయ్యాయని ఆమె తెలిపారు. గూండాలు తరచూ తన నివాసం వద్దకు వస్తున్నారని... ఈ క్రమంలో తాను తన ఇంట్లో కూడా ఉండటం లేదని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more