ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కాకుండా ఎమ్మెల్సీ అయి ఆపై మంత్రి వర్గంలోకి చేరేందుకు నారా లోకేష్ సర్వం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో కూడా ఎలక్షన్ ద్వారా కాకుండా ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక అవుతుండటంపై కాస్త విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో తాను బ్యాక్ డోర్ రాజకీయాలకు దూరమని ప్రకటించిన చినబాబు ఇప్పుడు ఇలా చేయటం ఏంటని కార్యకర్తల్లో కూడా ఒకరకమైన అసంతృప్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో సోమవారం పొలిట్ బ్యూర్ నిన్న ఎమ్మెల్సీ గా లోకేష్ పేరును ప్రతిపాదించటం, అందుకు తగ్గట్లే వారికి కృతజ్నత చెబుతూ ఓ ట్వీట్ వేయటం చూశాం. ఇక దానిపై ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు డాక్టర్ కేఏపాల్ స్పందించాడు. ఎన్నికలలో పోటీ చేసి, ఎమ్మెల్యేగా రావాలని అందులో సూచించారు. లోకేశ్ తరపున తాను ప్రచారం చేస్తానంటూ ఆఫర్ కూడా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ప్రచారం చేసినట్టుగానే లోకేశ్కు కూడా చేస్తానని, వెనక్కు తగ్గద్దని ట్వీట్లో పేర్కొన్నారు.
అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడి ఎమ్మెల్యేగా గెలిచి, ప్రభుత్వంలోకి అడుగుపెట్టాలేగానీ, ఎమ్మెల్సీగా రావాల్సిన అవసరం ఏముందని, ఆయన వ్యంగ్యంగా మాట్లాడాడంటూ ప్రతిపక్షాలు దానిని అన్వయించుకుంటున్నాయి. అయితే ట్రంప్ ను గెలిపించిన(చెప్పుకుంటున్నాడు) ఈ గొప్ప వ్యక్తి తలుచుకుంటే ఎమ్మెల్యే ఏంటి ఏకంగా సీఎం కూడా అవుతాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పాల్ గారి ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అన్నట్లు తన బోయింగ్ విమానం సమస్య రావటంతో సమంత, చైతూల పెళ్లికి హాజరుకాలేకపోయానని కూడా ఈయనగారు ట్వీట్ చేయటం గురించి వింత చర్చ జరుగుతోంది.
@naralokesh Contest in elections and be an MLA, I will campaign for you like the way I did for Trump. Never give up
— Dr K.A.Paul (@KAPaulOffiicial) February 27, 2017
@Samanthaprabhu2 Congratulations to you & chaitu. Unable to attend the marriage as my Boeing 747 got struck in the middle.God bless you both
— Dr K.A.Paul (@KAPaulOffiicial) February 26, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more