అంతరిక్ష పరిశోధనల్లో భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అద్భుత ప్రయోగంగా 104 ఉపగ్రహాలను సింగిల్ రాకెట్ ప్రయోగంతో కక్ష్యలో నిలిపిన విషయం అందరికీ తెలిసిందే. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి విజయవంతం చేసిన ఈ ప్రయోగంపై మాజీ చైర్మన్ జీ మాధవన్ నాయర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్రయోగంతో భారత్ కు భవిష్యత్తులో పెను ముప్పు పొంచి ఉందంటూ పెను కలకలమే రేపాడు.
ఇస్రోకు 400 ఉపగ్రహాలనైనా ఒకేసారి ప్రయోగించే సత్తా ఉందని అభినందించిన ఆయన, ఇప్పుడు ఈ తరహా ప్రయోగాలు సరికాదని హితవు పలికాడు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకోకుండా ఇస్రో ముందడుగు వేసిందని, ఈ 104 ఉపగ్రహాల్లో మూడు మాత్రమే భారత్ వని గుర్తు చేసిన ఆయన, డబ్బుల కోసం ఇష్టానుసారం ఉపగ్రహాలను పంపరాదని సలహా ఇచ్చారు. నానో ఉపగ్రహాల జీవితకాలం స్వల్పమని చెప్పిన ఆయన, ఆపై ఇవన్నీ అంతరిక్షంలో వ్యర్థాలుగా(చెత్తగా) మారుతాయని, నియంత్రణ లేక దిశారహితంగా తిరుగుతూ ఉంటాయని, ఒక్కోసారి పనిచేస్తున్న ఉపగ్రహాలను ఢీకొట్టే ప్రమాదముందని హెచ్చరించారు.
అటువంటప్పుడు కోట్లాది రూపాయల ధనం పనికిరాకుండా పోతుందని, భారత అవసరాల కోసం పంపిన శాటిలైట్లు సైతం నిరుపయోగం కావచ్చని అభిప్రాయపడ్డారు. స్వప్రయోజిత శాటిలైట్ల ప్రయోగం చేస్తేనే మంచిదన్న ఆయన, భవిష్యత్తులో విదేశీ ఉపగ్రహాలను పంపకపోవటమే మంచిదని సూచిస్తున్నాడు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇస్రో స్పందించేందుకు నిరాకరించింది. 2014 లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కి చెందిన ఓ భారీ శాటిలైట్ ఇలాంటి స్పేస్ వ్యర్థాల వల్లే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుందన్న ఉదాహరణను కూడా ఆయన చెబుతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more