చౌకధరల యుద్దంలో ప్రైవేటు విమానాశ్రాయ సంస్థలతో పాటు భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ కూడా చేరిపోయింది. ప్రైవేటు విమానయాస సంస్థలు చౌకధరల టిక్కెట్లను అందిస్తూ అఫర్లు గుప్పిస్తున్న తరుణంోల మరో అడుగు ముందేకేసిన ఎయిరిండియా.. ఏకంగా ఉచిత టిక్కెట్లను అందిస్తామని ప్రకటించింది. నమ్మశక్యంగా లేదా.. కానీ ఇది ముమ్మాటికీ నిజం. అదే తరుణంలో స్సైస్ జెట్ విమానయాన సంస్థ ఏకంగా అత్యంత చౌకగా లక్కీ సెవన్ అఫర్ కింద కేవలం 777 రూపాయలకే (అన్ని ధరలను కలుపుకుని) టిక్కెట్ ను అందిస్తుంది.
అరకోర సంఖ్యలో ప్రయాణికులు ఎక్కినా.. తప్పనిసరిగా గమ్యస్థానాలకు చేరాల్సిన విమానాలు.. సీటు అక్యూపెన్సీని పెంచుకనే క్రమంలో చౌకధరల కింద టిక్కెట్ల విక్రయాలను చేపడుతూ వ్రయాణికులకు బంపర్ అఫర్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసిన ఎయిర్ ఇండియా బై వన్ ప్లై టు అనే ఆపర్ కింద ఏకంగా ఉచిత టికెట్ ప్రకటనను చేసిన ప్రైవేటు విమానయాన సంస్థలకు చెక్ పెట్టింది. కాగా దేశీయంగా నాన్ మెట్రో మార్గాల్లో మాత్రమే ఈ అఫర్ వర్తించనుందని ఎయిర్ ఇండియా తెలిపింది.
అయితే ఎకానమి క్లాస్ లో కాకుండా ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి ఒకటి టిక్కెట్ కొంటే మరో టిక్కెట్ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ఇదే సమయంలో స్పైస్ జెట్ విమానయాన సంస్థ అత్యంత చౌకగా లక్కీ 7 అపర్ ప్రకటించింది. దీని కింద రూ.777 లకే విమానయాన చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. కాగా, ఈ ధర కింద కేవలం ఎంచుకున్న మార్గాల్లో మాత్రమే ప్రయాణించే అవకాశం వుందని సంస్థ వర్గాలు తెలిపాయి.
ఎయిర్ ఇండియ బై వన్ ఫ్లై టు అఫర్ కింద.. ఈ నెల 20 నుంచి మే 31 వరకు టిక్కెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం వుండగా, అదే సమయంలో వారి ట్రిప్ కూడా పూర్తి చేసుకోవాల్సి వుంటుంది. కాగా, స్సైస్ జెట్ లక్కీ సెవన్ అఫర్ కింద ఈ నెల 25 వరకు మాత్రమే టికెట్లను కోనుగోలు చేసుకునే అవకాశం వుంది. కాగా, ఈ ఆఫర్ కింది మార్చి 9 నుంచి ఏప్రిల్ 13 వరకు ప్రయాణాలు జరుకునే అవకాశం వుంది. కాగా రూ. 777 అపర్ కింద జమ్మూ-శ్రీనగర్, అగర్తలా-గౌహతి మార్గలను స్పైస్ జెట్ ఎంపిక చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more