తాము కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ తో సమస్యలను ఎదుర్కుంటున్నందున దానిని మరో కొత్త ఫోన్ తో రీప్లేస్ చేయాలని డిమాండ్ చేయడంతో పాటు దుకాణం సిబ్బంది చెబుతున్న వివరాలను వినకుండా వారిపై దాడికి పాల్పడుతూ.. దుకాణంలో వస్తువులను ధ్వంసం చేసి రచ్చ రంబోలా చేసిన తల్లికూతళ్లపై పోలీసుల కేసు నమోదు చేశారు. దేశరాజధాని ఢిల్లీలో పశ్చిమ డిళ్లీ రాజౌరీ గార్డెన్ ప్రాంతానికి చెందిన ఈ ఘటనకు పూర్తిగా దుకాణంలోని సిసీటీవీ ఫూటేజీలో నిక్షిప్తమయ్యింది.
వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల ఇరవైన సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో పాటు దుకాణంలోకి వచ్చారు. వాళ్లు దాదాపుగా ఐదు నెలల క్రితం తమ వద్ద కొనుగోలు చేసిన సామ్ సంగ్ ఫోన్ తో తరుచూ ఇబ్బందులు ఎదర్కోంటున్నామని సిబ్బందికి చెప్పారు. వెంటనే దానిని కొత్త సామ్ సంగ్ మొబైల్ ఫోన్ తో మార్పు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా సిబ్బంది ఇది సర్విస్ సెంటర్ కాదని, చెబుతున్న వినకుండా దుకాణంలో రాక్ లను కిందపడేశారు. అంతటితో అగకుండా సిబ్బందిపై దాడికి కూడా పాల్పడ్డారు.
ఈ ఘటనపై దుకాణాదారుడు విరాట్ కోహ్లీ వివరణ ఇస్తూ వారు కొనుగోలు చేసిన ఫోన్ కు ఇన్సూరెన్స్ కూడా వుందని, దానిని సర్విస్ సెంటర్ లో ఇస్తే వారు రీప్లేస్ చేయడమో లేక రిపేర్ చేయడమో చేస్తారని తమ సిబ్బంది చెబుతున్న వినకుండా దుకాణంలోని సామాగ్రిని ధ్వంసం చేశారని అరోపించారు. తన పవిత్రమైన అనే టర్బన్ ను లాగి దుర్బాషలాడినా తాను వారిని మాత్రం ఏమీ అనలేదని అన్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులు తల్లి ఇద్దరు కూతుళ్లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more