సుప్రీం తీర్పుతో శశికళ శకం ముగిసిపోయినట్టే. నిన్నమొన్నటి వరకు ముఖ్యమంత్రి పీఠం కోసం శశికళతో పోటీపడిన పన్నీర్ సెల్వానికి నేడు పళని స్వామికి సవాల్ విసురుతున్నాడు. సుప్రీం తీర్పుతో కంగుతిన్న శశికళ వర్గం పళనిస్వామిని మంగళవారం శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఎన్నికైన వెంటనే పళనిస్వామి ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్కు ఫ్యాక్స్ చేశారు. సాయంత్రం గవర్నర్ను కలిసి లేఖ అందించారు.
ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని, తనను ఆహ్వానించాలని కోరారు. ఆ తర్వాత కొద్దిసేపటికే పన్నీర్కు మద్దతు తెలుపుతున్న ఎంపీ మైత్రేయన్, మాజీ ఎంపీ మనోజ్ పాండ్యన్ గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. ‘అమ్మ’కు విధేయులైన ఈ ఇద్దరూ ఇప్పుడు బలనిరూపణకు సై అంటే సై అంటున్నారు. బలనిరూపణకు సిద్ధమంటున్న రెండు వర్గాల్లో ఏ ఒక్కరిని తొలుత ఆహ్వానించినా విమర్శలు కొని తెచ్చుకోవడమే అవుతుందని గవర్నర్ యోచిస్తున్నారు.
అయితే మధ్యేమార్గంగా అటార్నీ జనరల్ సూచించినట్టు ‘కాంపోజిట్’ బలపరీక్ష నిర్వహించాలని విద్యాసాగర్రావు నిర్ణయించినట్టు తెలుస్తోంది. తద్వారా మెజారీటీ ఉన్నవారే ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొస్తారని, ఎదురవబోయే విమర్శల నుంచి కూడా తప్పించుకోవచ్చని గవర్నర్ భావిస్తున్నట్టు రాజ్భవన్ వర్గాల భోగట్టా. రాజ్ భవన్ రహాస్యం
వేద నిలయం ఇక...
సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ భవితవ్యం ఏమిటో తేలిపోయింది. జయలలిత మరణానంతరం పోయెస్గార్డెన్లోని ఆమె నివాసం ‘వేద నిలయం’లో శశికళ, ఆమె సోదరుడి భార్య ఇళవరసి కాలుమోపారు. అక్కడి నుంచే శశికళ చక్రం తిప్పారు. ఇప్పుడు సుప్రీం తీర్పుతో వారు జైలుకు వెళ్లనున్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో ప్రస్తుతం ‘వేద నిలయం’ కళ తప్పింది. ఇప్పుడది ఖాళీ కానుంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వేద నిలయాన్ని స్మారక మందిరం చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే డిమాండ్తో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వారం రోజులుగా సంతకాల సేకరణ ఉద్యమాన్ని కూడా చేపట్టాడు.
అన్నాడీఎంకే వర్గాలతోపాటు ప్రజల నుంచి కూడా దీనికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ‘అమ్మ’ నివసించిన వేదనిలయం తమకు మందిరంతో సమానమని, అందులో ఇతరులు నివసించేందుకు అంగీకరించేది లేదని పార్టీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. సుప్రీం తీర్పు మరోలా వచ్చి ఉంటే ఎలా ఉండేదో కానీ ఆమెకు వ్యతిరేకంగా రావడంతో వేద నిలయాన్ని స్మారకం మందిరంగా చేయడం ఇప్పుడు మరింత సులభమైందని చెబుతున్నారు. ఆనాడు ఇలాగే జరిగి ఉంటేనా?...
సుప్రీంకు శశి లాయర్లు..
వెంటనే లొంగిపోవాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినప్పటికీ, ఆ ఆదేశాలు అందలేదంటూ శశికళ రాత్రంతా పోయెస్ గార్డెన్స్ లోనే ఉన్న విషయం తెలిసిందే. బయట గుమిగూడిన అభిమానులను ఓదార్చే ప్రయత్నం చేసిన చిన్నమ్మ శశికళ.. ఆ తర్వాత లోపలకు వెళ్లిపోయారు. పోలీసులు కూడా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అయితే, పోలీసులు ఆమెను అరెస్టుచేసి బెంగళూరు తీసుకెళ్తారా లేద అన్నది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు.
ఈ నేపథ్యంలో శశికళే స్వయంగా బెంగళూరు వెళ్లి అక్కడ లొంగిపోవచ్చని విశ్వసనీయ సమాచారం. మరోవైపు బుధవారం ఆమె తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇక ఇప్పటికే ఆరు నెలల జైలుశిక్ష అనుభవించిన శశికళ.. మరో మూడున్నరేళ్ల పాటు జైల్లో ఉండాల్సి వస్తుంది. అప్పట్లో జయలలితతో పాటు ఉన్న పరప్పణ అగ్రహా జైల్లోనే ఇప్పుడు కూడా శశికళ ఉండాల్సి ఉంటుంది. ఆమెతో పాటు ఇళవరసి, సుధాకరన్ సైతం జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. దాంతోపాటు సుప్రీం కోర్టు విధించిన జరిమానాను కూడా వాళ్లు ముగ్గురూ చెల్లించాల్సి ఉంటుంది. ఇక శశికళ కోసం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు ముస్తాబవుతోంది. గతంలో ఇదే కేసులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇదే జైలులో కొన్ని రోజులు ఉన్నారు. అప్పుడామెకు కేటాయించిన బ్యారక్లోనే ఇప్పుడు శశికళను కూడా ఉంచే అవకాశం ఉంది.
ఈమేరకు సన్నాహాలు పూర్తి చేసిన జైలు అధికారులు ‘చిన్నమ్మ’ రాక కోసం ఎదురుచూస్తున్నారు. సిటీ సెంట్రల్ జైలు వద్ద ముందు జాగ్రత్త చర్యగా వందమంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా శశికళ ఈ రోజు లొంగిపోతే సాయంత్రంలోగా జైలుకు తరలించే అవకాశం ఉంది. అయితే కేసుపై అప్పీలు దాఖలు చేసుకునే అవకాశం ఉండడంతో మరో రెండు రోజులు ఎదురు చూడాలని శశికళ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
సంబంధిత కథనాలు...
సుప్రీం తీర్పుపై శశికళ రియాక్షన్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more