సాక్షి బిల్డింగ్, లోటస్ పాండ్ ఇల్లు అటాచ్.. జగన్ కి కోలుకోలేని దెబ్బ! | Big Shock to YS Jagan in Quid pro quo case.

Jagan mohan reddy s lotus pond property may attach soon

The Enforcement Directorate, YS Jagan Mohan Reddy, Lotus Pond Property Attach, YS Jagan ED, ED Attach, Sakshi Building and Lotus Pond, Lotus Pond Attach, ED Attachment, Jagan ED, The Prevention of Money Laundering Act YS Jagan, Jagan Properties, Jagan Quid Pro Quo Case, YS Jagan Court Stay

The Enforcement Directorate on Thursday issued a public notice under the Prevention of Money Laundering Act (PMLA) taking possession of the properties of AP Opposition leader Y.S. Jagan Mohan Reddy and his companies, his house and the building hosting the YSR Congress headquarters at Lotus Pond in Banjara Hills, in connection with the quid pro quo investments case.

వైఎస్ జగన్ కి మరో బిగ్ షాక్

Posted: 02/11/2017 08:54 AM IST
Jagan mohan reddy s lotus pond property may attach soon

అక్రమాస్తుల కేసులో వైఎస్సార్సీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పెద్ద షాకే ఇచ్చింది. మరో పది రోజుల్లో ఆయన ఇల్లు, ‘సాక్షి’ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. ఆస్తుల స్వాధీనానికి సహకరించాలంటూ గురువారం ఈడీ నోటీసులు జారీ చేయటంతో జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది. జగన్ నివాసంతోపాటు, సాక్షి కార్యాలయానికి వెళ్లిన అధికారులు నోటీసులు అందజేశారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన ఏయే ఆస్తులను స్వాధీనం చేసుకోబోతున్నదీ ప్రకటన కూడా విడుదల చేశారు.

వాస్తవానికి ఆస్తుల స్వాధీనానికి ఈడీ నెలన్నర సమయం ఇస్తుంది. అయితే అత్యంత తీవ్రమైన నేరాల్లో కేవలం పదిరోజులు మాత్రమే గడువు ఇస్తుంది. ఇప్పుడు జగన్ విషయంలో అదే జరిగింది. ప్రస్తుతం ఎలా స్పందించాలన్న దానిపై జగన్ తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. హైకోర్టును ఆశ్రయించాలన్నా సోమవారం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. అప్పటికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుందని భయపడుతోంది. ఈనెల 20 లోపు ఈడీ నోటీసులపై స్టే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు కోర్టు స్టే ఇవ్వకుంటే పరిస్థితి ఏంటన్న దానిపై ఆందోళన మొదలైంది. హైకోర్టు కనుక స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించేంత సమయం ఉంటుందా? లేదా? అన్నదానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈడీ కనుక ఆస్తులు స్వాధీనం చేసుకుంటే ప్రజల్లో అది జగన్‌కు ప్రతికూల అంశంగా మారుతుందని కొందరు వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే వీలైనంత త్వరగా స్టే తెచ్చుకునేందుకే ప్రయత్నిస్తున్నారు.

Jagan Lotus Pond Attachment

అటాచ్ చేయబోయే ఆస్తులు...

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల స్వాధీనానికి సిద్ధమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ).. తాము స్వాధీనం చేసుకోబోయే ఆస్తుల వివరాలను వెల్లడించింది. ఈడీ స్వాధీనం చేసుకోబోయే ఆస్తుల్లో హైదరాబాద్‌లోని సాక్షి దినపత్రిక ప్రధాన కార్యాలయం కూడా ఉంది. ఈ ఆస్తులన్నీ షలోమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ పేరుతో ఉన్నాయి.
- బంజారాహిల్స్ రోడ్ నంబర్-1లోని నవీనగర్‌‌లో ఈ కంపెనీ 2623 చదరపు గజాల ప్లాటును కొనుగోలు చేసి అందులో ఎనిమిది అంతస్తుల భవనాన్ని నిర్మించింది. ఇందులోనే సాక్షి దినపత్రిక, టీవీ చానల్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.
- సాక్షి బిల్డింగ్ పక్కనే మరో వెయ్యి చదరపు గజాల స్థలంలో సెల్లార్, సబ్ సెల్లార్‌తోపాటు నాలుగు అంతస్తుల భవనం ఉంది.
- హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో ఉన్నజగన్ విలాసవంతమైన నివాసం ఉంది.
- కడప మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిళ్లపల్లిలో ఉన్న హరీశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన 7.85 ఎకరాల భూమి.
- సైబరాబాద్‌లోని రాజేంద్రనగర్ మండలం కాటేదాన్‌లో నివిష్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన 9680 చదరపు గజాల స్థలం,
- మహేశ్వరం మండలం సర్దార్ నగర్ రెవెన్యూ గ్రామంలో ఉన్న 32.31 ఎకరాల భూమిని ఈడీ స్వాధీనం చేసుకోనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  ED  Lotus Pond  Sakshi Buliding  Attachment  

Other Articles