ఏపీ లో కాస్త గ్యాప్ తీసుకున్న పార్టీ ఫిరాయింపులు మళ్లీ వార్తల్లో నిలిచాయి. అయితే అల్రెడీ జంపింగ్ బాబులు అధికార పార్టీలో ఇమడ లేక తిరిగి సొంత గూటికే చేరుకోబోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూల్ కీలక నేత ఒకరు వైసీపీలో చేరుతున్నారన్న వార్త రెండు రోజులుగా హల్ చల్ చేస్తోంది. పార్టీ నియోజక వర్గ ఇన్ ఛార్జీ గంగుల ప్రభాకర్ రెడ్డి త్వరలో పార్టీని వీడుతారని టీడీపీ అనుకూల మీడియానే హైలెట్ చేయటం ఇక్కడ విశేషం. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికార పక్షం మైండ్ గేమ్ మొదలుపెట్టింది.
కడప నుంచి బలమైన నేత ఒకరు టీడీపీలో చేరనున్నారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ పేర్కొనటం విశేషం. రాయలసీమలో టీడీపీ ప్రభంజనం సృష్టిస్తుందని, కడపకు పూర్వవైభవం వస్తుందంటూ తెలిపాడు కూడా. అయితే, టీడీపీలోకి వస్తున్న ఆ నేత ఎవరు, ఏ పార్టీ నుంచి అనే వివరాలను ఆయన ప్రస్తావించలేదు. కామెంట్లను నిశితంగా పరిశీలిస్తే కేవలం గంగుల చేరికను అడ్డుకునేందుకే ఇలా వ్యాఖ్యలు చేశాడా? అన్న అనుమానాలు కలగక మానవు.
2014 ఎన్నికలకు ముందు శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, ఆపై సానుభూతి పవనాలతో అఖిల ప్రియ గంగుల పైనే గెలవటం తెలిసిందే. కొంతకాలానికే జగన్ తో ఇమడలేక నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి, తన కూతురైన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ ను తీసుకుని టీడీపీలోకి చేరిపోయారు. ఈ నిర్ణయాన్ని శిల్పాసోదరులతోపాటు, గంగుల కూడా ఓపెన్ గానే వ్యతిరేకించాడు. దీంతో రంగంలోకి దిగిన చంద్రబాబు వ్యవహారాన్ని అప్పటికప్పుడు చక్కబెట్టాడు.
ఇక ఇప్పుడు భూమాకు మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలియగానే శిల్పాబ్రదర్స్ తోపాటు, గంగుల రంగంలోకి దిగారు. మంత్రి పదవి ఇవ్వొద్దంటూ ఇప్పటికే విన్నవించుకున్నారు కూడా. అయితే ఈ విషయంలో వారికి చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఒకే ఒరలో ఇమడటం కష్టమని భావించిన గంగుల పార్టీని వీడేందుకే సిద్ధమైనట్లు సమాచారం. ఇదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. నియోజక వర్గానికి ఎమ్మెల్యే అఖిలప్రియే అయినప్పటికీ, నిధులు మాత్రం టీడీపీ ఇన్చార్జ్ గంగుల ప్రభాకర్ రెడ్డి పేరుతోనే ఇంతకాలం మంజూరు చేశారు. రాను రాను చంద్రబాబు భూమా కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వటం, గంగుల వర్గాన్ని పట్టించుకోవడం మానేయటంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమౌతోంది.
ఇదిలా ఉండగానే వైఎస్సార్సీపీ అధినేత జగన్ సొంత జిల్లా నుంచి ఒక నేత టీడీపీలోకి వస్తున్నారంటూ గంటా చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. మరోవైపు బలం ఎక్కువగా ఉన్న నేత కావటంతో అంతర్గతంగా గంగులను బుజ్జగించేయత్నాలు చేస్తున్నారని టాక్.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more