తమిళనాడు పొలిటికల్ డ్రామా దాదాపు క్లైమాక్స్కు చేరుకున్నట్లే. ఆ రాష్ట్ర ఇన్ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావు... పన్నీర్ సెల్వం, శశికళ నటరాజన్లతో వేర్వేరుగా చర్చించిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన అంశం గవర్నర్ ఓ నిర్ణయం తీసుకోవడమే. పన్నీర్ సెల్వం భేటీ అనంతరం మీడియాతో మాట్లాడగా, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మాత్రం ఏం మాట్లాడకుండా వెళ్లిపోవటం ఆసక్తికరంగా మాట్లాడింది. అయితే ఈ విషయంపై చిన్నమ్మ నోరు మెదపకపోయినా, ఆమె శిబిరంలోని నేతలు మాత్రం కొంత సమాచారం బయటపెట్టారు.
తనకు మద్దతుగా ఉన్న 130 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఆమె కోరారట. ప్రభుత్వం ఏర్పాటు చేసే నిమిత్తం తనకు అవకాశమివ్వకపోతే, మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలను రాష్ట్రపతి ముందు ప్రవేశపెట్టేందుకు తాను సిద్ధమని గవర్నర్ తో చెప్పారట. కాగా, శశికళ తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల సంతకాలు చేసిన పత్రాన్ని గవర్నర్ కు సమర్పించినట్లు సమాచారం. మరోవైపు ఈ సంతకాలన్నీ ఫోర్జరీ చేసినవే అని పన్నీర్ సెల్వం వర్గీయుడు మైత్రేయన్ ఆరోపించడం విదితమే.
పన్నీర్ సెల్వం బలనిరూపణకు సిద్ధమని గవర్నర్కు చెప్పగా, శశికళ కూడా అవసరమైతే బలనిరూపణ చేసుకోవచ్చని ప్రకటిస్తూ.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ను కోరారు. దీంతో గవర్నర్ తీసుకోనున్న నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ తన నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారన్న అంశంపై స్పష్టత లేదు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రానికి నివేదిక కూడా ఇచ్చారన్న సమాచారం ఉంది. న్యాయ నిపుణుల సలహా తీసుకుని నేడో, రేపో దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.
అయితే, గవర్నర్తో చర్చించాక పన్నీర్ సెల్వంలో కనిపించిన సంతోషం చూస్తోంటే ఆయనకు అనుకూలంగానే గవర్నర్ నిర్ణయం ఉంటుందని పలువురు అంటుంటే, మద్దతు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోన్న శశికళకు అనుకూలంగా ఉంటుందని మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఉత్కంఠకు తెర ఎలా పడుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
సెల్వంకే పట్టం...
తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎవరు కొనసాగాలంటూ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో 95 శాతం మంది పన్నీర్ సెల్వానికే పట్టం కట్టారు. 52 వేల మంది పాల్గొన్న ఈ సర్వేలో నెటిజన్లలో అత్యధికశాతం పన్నీర్కే మద్దతు తెలిపారు. ‘తమిళనాడుకు నాయకత్వం వహించేందుకు గౌరవ ముఖ్యమంత్రి తన పదవిలో కొనసాగాలా?’ అన్న ప్రశ్నను ఆన్లైన్లో ఉంచగా అత్యధికులు పన్నీర్కే ఓటేశారు.
ఇక తనపై అసత్య ప్రచారం చేస్తే శశికళ బండారం బయట పెడతానని హెచ్చరించారు. ఆమె శశికళ కాదు కుట్రకళ అని మండిపడ్డారు. గవర్నర్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన చెన్నైలోని తన నివాసంలో మరోసారి మాట్లాడారు. పార్టీకి తాను ద్రోహం చేశానం టూ విమర్శిస్తున్నారని, ద్రోహి ఎవరో ప్రజల కు, పార్టీ శ్రేణులకు బాగా తెలుసని అన్నారు. పార్టీ ద్రోహులను గతంలో జయలలితే గుర్తిం చారని చెప్పారు. పార్టీ, ప్రభుత్వ పదవులు కోరుకోనంటూ జయలలిత వద్ద లిఖిత పూర్వకంగా క్షమాపణలు కోరిన శశికళ అందు కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబ ట్టారు. పోయెస్ గార్డెన్లో తన బంధువులకు స్థానం కల్పించడం ద్వారా జయకు శశికళ ద్రోహం చేశారని పన్నీర్ విమర్శించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more