తప్పతాగి వాహనాలు నడపటం, ఆపై అమాయకపు ప్రాణాలు పోయేందుకు కారకులుగా మారుతున్నారు మందు బాబులు. అలాంటి సందర్భాలలో వారి ప్రమేయం(మద్యం మత్తుతోనే) లేకుండానే ఇలా జరిగిందంటూ న్యాయస్థానాలు తక్కువ శిక్షతో విడిచిపెడుతుండటం చూస్తున్నాం. ఈ వంకతోనే ధైర్యంగా తాగి బండిని రోడ్డు మీదకు ఎక్కించేస్తున్నారు. అయితే ఇకపై అలాంటి వేషాలు కుదరవు. తాగి వాహనాలు నడిపే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది.
తాగి వాహనం నడిపి వ్యక్తుల ప్రాణాలు తీసేవారిపై ఇక నుంచి తీవ్ర హత్యానేరం మోపి శిక్షించాలని యోచిస్తోంది. ఇందుకోసం ప్రస్తుత చట్టంలో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇకపై తాగి వాహనం నడిపి ఇతరుల ప్రాణాలు తీస్తే నిర్లక్ష్యం కిందకు రాదని, దానిని తీవ్రమైన హత్యగానే పరిగణించాలని మోటారు వాహనాల బిల్లుపై పార్లమెంటరీ స్థాయీ సంఘం తన నివేదికలో పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ నేత ముకుల్ రాయ్ నేతృత్వంలోని 32 మంది సభ్యుల బృందం ఈ నివేదికను రూపొందించింది.
ప్రమాదానికి కారణమైన వారిపై 304 సెక్షన్ కింద శిక్షార్హమైన హత్యకు పాల్పడేవారికి యావజ్జీవ జైలు శిక్ష లేదంటే పదేళ్ల కఠిన కారాగారం, లేదంటే జరిమానా విధించాలని కమిటీ సిఫారసు చేసింది. మైనర్ల విషయానికొస్తే వారి పేరెంట్స్ లేదా గార్డియన్లకు 3 ఏళ్ల శిక్ష, పాతిక వేల ఫైన్ విధించటంతోపాటు డ్రైవింగ్ వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేసేలా చట్టం తేబోతుంది.
తాగి నడిపి ప్రమాదానికి పాల్పడితే ముందస్తు పథకంగానే భావించి శిక్ష విధించాలని సూచించింది. నిందితులు వాహనం నడిపినప్పుడు తాగి ఉన్నారో లేదో తెలుసుకునేందుకు అంతర్జాతీయ పరీక్ష పరికరాలు వాడాలని సూచించింది. అలాగే బైక్, కార్ల రేసింగ్లపైనా కొరడా ఝళిపించాలని సిఫారుసు చేసింది. రేసింగ్లకు పాల్పడే వ్యక్తులపై విధిస్తున్న జరిమానా మొత్తాన్ని పెంచాలని కమిటీ తన నివేదికలో పేర్కొంది.
ప్రస్తుతం ఇలా ప్రాణాలు తీసేవారికి ఐపీసీలోని 304 ఏ సెక్షన్ కింద రెండేళ్ల జరిమానా లేదా ఫైన్. లేదా రెండూ విధించటం తెలిసిందే. ఓ అంచనా ప్రకారం ఏడాదికి 1.46 లక్షల ప్రజలు ఏటా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతుండటం, అందులో 5 శాతం అంటే సుమారు 7 వేల మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లోనే ప్రాణాలు కోల్పోతుండటంతో ఇలా కఠిన చట్టాలు తేవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more