తమిళనాడు అధికారపార్టీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పన్నెండు గంటల వ్యవధిలో రెండు పర్యాయాలు మీడియా ముందుకు వచ్చి చిన్నమ్మ శశికళకు సవాల్ విసిరిన అపధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం గురువారం ముంబైకి పయనం కానున్నారు. గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావుతో ఆయన భేటీ కానున్నారు. తాను రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులను గవర్నర్ కు వివరించనున్నారు. తనను బలవంతం పెట్టి పదవికి రాజీనామా చేయించారని, ఆ తరువాత తనపై పార్టీ వ్యతిరేకని ముద్రవేసి కోశాధికారి పదవి నుంచి తప్పించారని గవర్నర్ కు వివరించనున్నారు.
అన్నాడీఎంకే పార్టీని అన్నివిధాలుగా పరిరక్షించాల్సిన బాధ్యత తనపై వుందని.. ప్రజలు, పార్టీ, ఎమ్మెల్యేలు కోరుకుంటే రాజీనామా వెనక్కి తీసుకోవడానికి సిద్ధమని పన్నీరు సెల్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో గవర్నర్ తో ఈ విషయమై కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ముంబైకి పయనం కావాలని నిర్ణయించడం కీలకంగా మారింది. గవర్నర్ తో ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తన నివాసంలో మద్దతుదారులతో పన్నీరు సెల్వం మంతనాల్లో మునిగిపోయారు. శశికళను దీటుగా ఎదుర్కొనే వ్యూహాలపై చర్చించారు.
కాగా మరోవైపు అన్నాడీఎంకే పార్టీకి చెందిన 130 మంది శాసనసభ్యుల బలం తనకు వుందని ప్రకటించిన శశికళతో పాటుగా ఆమెకు మద్దతిస్తున్న 130 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఇవాళ రాత్రి ఢిల్లీకి పయనమై రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీని కలవనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అమె రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ను తీసుకున్నారు. గవర్నర్ విద్యాసాగర్రావు ముంబై నుంచి చెన్నైకి రాకపోవడంతో శశికళ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం వాయిదా పడింది. దీంతో ఆ విషయాన్ని రాష్ట్రపతికే విన్నపించి తనకున్న బలం నిరూపించుకోవాలని శశికళ పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగానే శిశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద పరేడ్కు హాజరైన ఎమ్మెల్యేలను బస్సుల్లో ఓ హోటల్కు తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more