తమిళనాడు అధికారపార్టీలో నాటకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. పన్నెండు గంటల వ్యవధిలో రెండు పర్యాయాలు మీడియా ముందుకు వచ్చి చిన్నమ్మ శశికళకు సవాల్ విసిరిన అపధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం.. జయ మృతిపై అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత తన ప్రభుత్వంపై వుందని, తాను ముఖ్యమంత్రిగా కోనసాగాలని తమిళనాడు వాసులు కోరుకుంటున్నారని చెప్పచకోచ్చిన నేపథ్యంలో అన్నాడీఎంకే ఆఫీసులో శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది.
శశికళ అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమావేశానికి 130 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని ఆమె వర్గీయులు చెబుతున్నారు. 48 గంటల్లో పన్నీర్ సెల్వం మాటమార్చారని శశికళ ఆరోపించారు. పన్నీర్ సెల్వం వెనక కొందరు ఉండి నడిపిస్తున్నారని ఆమె చెప్పారు. తనకు 130 మంది ఎమ్మెల్యే మద్దతు ఉందని, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా తనవైపే ఉన్నారని శశికళ దీమా వ్యక్తం చేశారు. జయలలిత బాటలోనే నడుద్దామని ఆమె పిలుపునిచ్చారు. తాను 33 ఏళ్లుగా అమ్మ జయలలితకు వెంట వున్నానని అన్నారు. సమస్యలను ఎదుర్కోనే సమయస్పూర్తి అమ్మదని అన్నారు. సీఎం సీటు కోసం అమ్మ ఆశయాలను పన్నీరు సెల్వం పనంగా పెట్టారని తీవ్రంగా దుయ్యబట్టారు.
పన్నీర్ సెల్వంలో 48 గంటల్లో మార్పు ఎందుకు వచ్చిందో.? ఆయన వెనుక ఎవరున్నారో ప్రజలు గమనించాలని శశికళ సూచించారు. ఎవరెన్నీ కుట్రలు చేసినా.. కుయుక్తులను పనిన్నా.. పార్టీ ఐక్యతను కాలరాయలేరని ఆమె తెలిపారు. అన్నాడీఎంకేను ఏ శక్తి విడదీయలేదని శశికళ చెప్పారు. సీఎం కుర్చీపై విపక్షాలు కన్నేశాయని ఆమె ఆరోపించారు. అసెంబ్లీలో డీఎంకే సభ్యులతో పన్నీర్ సెల్వం కలిసిపోయారని ఆమె చెప్పారు. కుట్ర జరిగింది అనడానికి నిన్నటి స్టాలిన్ ప్రసంగమే నిదర్శనమని శశికళ పేర్కొన్నారు. అమ్మ చనిపోయిన వెంటనే బాధ్యతలు చేపట్టాలని పార్టీ సభ్యులు తనను కోరారని, ఇది సరైన సమయం కాదని, వద్దని వారించాననని శశికళ చెప్పారు.
అమ్మ ఆత్మ ఎప్పుడూ తన వెంటే ఉంటుందన్నారామె. గతంలో కూడా పన్నీర్ సెల్వంకు అమ్మ అవకాశం ఇచ్చారన్నారు. అదే దారిలో సెల్వానికి తాను ఒక అవకాశం ఇచ్చానని తెలిపింది. ఇప్పుడు డీఎంకేతో చేతులు కలుపుతున్నారన్నాడు. డ్రామాలు టీవీకి పనికొస్తాయి.. పార్టీకి కాదన్నారు. పన్నీరు సెల్వం కుట్రదారు అని, అన్నాడీఎంకే పార్టీకి ద్రోహం చేశారని విమర్శలు గుప్పించారు. అమ్మ వారసురాలని తానేనని.. సీఎం కూడా తానేనంటూ ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. సమావేశం అనంతరం శశికళ వర్గం ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయం వద్ద పరేడ్ నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా తమిళనాడులోని పలు ఐదు స్టార్ హోలళ్లకు తరలివెళ్లారు.
కాగా మరోవైపు అన్నాడీఎంకే పార్టీకి చెందిన 130 మంది శాసనసభ్యుల బలం తనకు వుందని రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు తెలియజేశామని, అయితే అయన ఇంకా తమతో ప్రమాణస్వీకారం చేయించడానికి న్యాయ సలహా కోరుతున్న నేపథ్యంలో శశికళ మరో అడుగు ముందుకేశారు. గవర్నర్ విద్యాసాగర్ రావును కాదని ఏకంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్ మెంట్ ను శశికళ తీసుకున్నారని, ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు రాష్ట్రపతిని కలవనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. శరవేగంగా మారుతున్న రాజకీయ మార్పుల నేపథ్యంలో తమిళనాడు వాసులు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందన్న విషయమై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more