పెను సంచలనం, రాజకీయ విశ్లేషకులు సైతం ఊహించని ఘటన మంగళవారం తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకుంది. వీరవిధేయుడు అయిన పన్నీర్ సెల్వం మంగళవారం రాత్రి ఒక్కసారిగా ‘చిన్నమ్మ’పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలనుకున్న శశికళకు షాకిచ్చారు. ప్రజలు కోరుకుంటే తన రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. ముందుగా మెరీనా బీచ్ లోని అమ్మ సమాధి వద్దకు చేరుకున్న ఆయన రాత్రి 9 గంటల వేళ జయలలిత సమాధి వద్ద అంజలి ఘటించిన ఆయన దాదాపు 45 నిమిషాల పాటు అక్కడే ఉండిపోయారు.
అనంతరం కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ‘అమ్మ’ చెప్పిందటూ పలు విషయాలు వెల్లడించారు. శశికళ వర్గం వారు తనతో బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపించారు. ‘నా అంతరాత్మ వేదనతో రగిలిపోతోంది’.. అని మొదలుపెట్టిన పన్నీర్ సెల్వం దేశ ప్రజలు, పార్టీ కార్యకర్తలకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. తనకు జరగకూడనిది ఏదైనా జరిగితే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాలని ‘అమ్మ’ తన చేతులు పట్టుకుని మరీ చెప్పారని తెలిపారు.
అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ను ఎన్నుకోవాలన్నారు. అయితే ఇప్పటికే రెండుసార్లు సీఎంగా ఉండడంతో తాను నిరాకరించానని, ప్రజలు, కార్యకర్తలు కోరుకునే వారినే ముఖ్యమంత్రిని చేయాలని సూచించానని వివరించారు. ఇతరులు ఎవరైనా ముఖ్యమంత్రి అయితే పార్టీకి భంగం వాటిల్లే ప్రమాదం ఉండడంతోనే చివరికి సీఎంగా ఉండేందుకు అంగీకరించానని పన్నీర్ సెల్వం తెలిపారు.
అడుగడుగునా అవమానం...
సీఎం అయిన తాను పార్టీ ప్రతిష్ఠను కాపాడుకునేందుకు ప్రయత్నించానని, అయితే తన ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డుతగిలారని పేర్కొన్నారు. ప్రతిసారి తన స్థాయిని తగ్గించాలని చూశారన్నారు. ఆదివారం తనను పోయెస్గార్డెన్కు పిలిచారని, అప్పటికే అక్కడ పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, శశికళ కుటుంబ సభ్యులు ఉన్నారని వివరించారు. అక్కడికెళ్లిన తనతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమని శశికళ డిమాండ్ చేశారన్నారు. శశికళ వ్యాఖ్యలతో హతాశుడినైన తాను తనకు తెలియకుండా సమావేశం ఎందుకు నిర్వహించారని ప్రశ్నించానని నిలదీశానన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రిగా ఒకరే ఉండాలని, కాబట్టి ఆమెను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నామని ఎమ్మెల్యేలు చెప్పడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని పన్నీర్ చెప్పుకొచ్చారు.
వారితో రెండు గంటలపాటు వాదించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తనతో రాజీనామా చేయించడం సబబేనా అని ప్రశ్నించానని తెలిపారు. అయితే పార్టీ క్రమశిక్షణ కోసం అవమానాన్ని భరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. జయ సమాధి వద్దకు వెళ్తానన్నా అనుమతించలేదన్నారు. తమిళనాడుకు తాను కాకపోయినా రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడే వ్యక్తే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అందుకోసం ఒంటరిగానైనా చివరి వరకు పోరాడేందుకు సిద్ధమని పన్నీర్ సెల్వం ప్రకటించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more