నోట్ల రద్దు తర్వాత కొత్త నోట్ల కోసం ఇబ్బందిపడ్డ ప్రజలకు ఊరటనిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకోనుందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నగదు విత్ డ్రా కు సంబంధించి అతి త్వరలో తీపి కబురు అందనుందంట. విత్డ్రాపై విధించిన ఆంక్షలను పూర్తిగా తీసేసేందుకు ఆర్బీఐ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు తమకు ముందస్తు సమాచారం కూడా అందజేసినట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, మొదట్లో రూ.2 వేలకు మాత్రమే పరిమితమైన విత్ డ్రాయల్స్ను తర్వాత రూ.2,500కు, ప్రస్తుతం రూ.10వేలకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం నగదు చలామణి పెరిగి క్రమంగా సాధారణ పరిస్థితులకు చేరుకుంటుండడంతో ఫిబ్రవరి చివరి నాటికి ఆ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఆర్బీఐ భావిస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్కే గుప్తా తెలిపారు.
ఇక పెద్ద నోట్ల రద్దు తర్వాతి రద్దయిన పాత నోట్లను ఇంకా కలిగి ఉన్న వారికి గుడ్ న్యూస్ అందించేందుకు ఆర్బీఐ రెడీగానే ఉన్నట్లు తెలుస్తోంది. తమ దగ్గర కొద్దో గొప్పో మిగిలి ఉన్న పెద్ద నోట్లను నేరుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ మరోసారి వెసులుబాటును కల్పించవచ్చని వార్తలు వస్తున్నాయి. నోట్ల మార్పిడికి కాకుండా కేవలం డిపాజిట్లకే ఈ వెసులుబాటును ఇవ్వవచ్చని ఆర్బీఐ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ పత్రిక కథనం రాసింది. సహేతుక కారణాలను వివరిస్తూ పాత నోట్లను ఆర్బిఐ నిర్దేశిత కౌంటర్లలో డిపాజిట్ చేసేందుకు గడువు మార్చి 31వ తేదీ వరకు ఉన్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more