గోవధను నిషేధించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టేసింది. జంతువుల అక్రమ రవాణాను ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కట్టడి చేశాయని, అలాగని గోవధ పై నిషేధం విధించాలంటూ రాష్ట్రాలను పూర్తిగా ఆదేశించలేమంటూ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
మహారాష్ట్ర, హరియాణా, మధ్యప్రదేశ్ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు గోవధను, గోమాంసాన్ని నిషేధించాయి. ఈ నేపథ్యంలో.. దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా అదే విధానాన్ని అవలంభించాలని ఒక వర్గం నుంచి డిమాండ్ వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు వినీత్ సహాయ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్ వేశారు.
అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలలో గోవధను సమూలంగా నిషేధించాలని, కబేళాలు ఎత్తేసేలా ఉత్తర్వులు జారీచేయాలన్న కుదిరేపని కాదని స్పష్టం చేసింది. సదరు వ్యాజ్యం విచారణకు ఏమాత్రం అర్హం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 'కొన్ని రాష్ట్రాలు గోవధను నిషేధించాయి. ఇంకొన్ని రాష్ట్రాలు అలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రాలు రూపొందించుకునే చట్టాలపై మేం జోక్యం చేసుకోలేం. దేశమంతటా గోవధను నిషేధించేలా ఆదేశాలు ఇవ్వలేం..' అని తేల్చి చెప్పింది.
కాగా, గతేడాది ఆగష్టులో మహారాష్ట్రకు చెందిన 36 మంది డీలర్లు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 16 ఏళ్లు దాటిన గోవులు వట్టిపోతాయని, అలాంటి వాటిని వ్యవసాయానికి కాదు కదా ఎందుకు ఉపయోగించలేమని, అందుకే వాటితో వ్యాపారం చేసేందుకు అనుమతించాలని కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more