దేశ రాజధానిలో అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయి. మన దేశస్తులే కాదు.. పరాయి దేశస్థులు కూడా మన అడపడచులపై దారుణాలకు ఒడిగడుతున్నారు. విదేశాలకు చెందిన యువకులు మన భారత గడ్డపై మన అడపడచులను తెరచుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయంటే అందుకు అస్కారం కల్పించిన వారెవరూ అన్న ప్రశ్నలు కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతున్నాయి. ఇక పాశ్చాత సంస్కృతికి బానిసలై అదే జీవన ప్రమాణాలను కొనసాగించాలని భావిస్తే ఇలాంటి దారుణాలు జరుగుతాయని చెప్పడానికి ఈ అత్యాచార ఘటన ఒక ఉదాహరణ.
దక్షిణ ఢిల్లీలోని గ్రీన్ పార్క్ ప్రాంతంలో 21 ఏళ్ల జేఎన్యూ విద్యార్థినిపై ఇద్దరు అఫ్ఘానిస్థాన్ దేశీయులు సామూహిక అత్యాచారం జరిపారు. జేఎన్యూలో బీఏ (ఆనర్స్) రెండో సంవత్సరం చదువుతున్న ఆ బాధితురాలు.. గత వారం తన స్నేహితురాలితో కలిసి హౌజ్ ఖాస్ గ్రామంలోని ఒక పబ్కు వెళ్లింది. అక్కడ ఆమెకు అఫ్ఘానిస్థాన్కు చెందిన త్వాబ్ అహ్మద్ అలియాస్ సలీం (27)తో పరిచయం అయ్యింది. తన స్నేహితుడు, అఫ్ఘాన్కే చెందిన సులేమాన్ అహ్మదీ (31)తో కలిసి ఉంటున్న సలీం.. బాధితురాలిని, ఆమె స్నేహితురాలిని తమ ఇంట్లో పార్టీ ఉంది రమ్మని పిలిచాడు.
ఆమె అక్కడకు వెళ్లేసరికి సలీం స్నేహితులు సులేమాన్, సిద్ధాంత్, ప్రత్యూష ఉన్నారు. ఆమె స్నేహితురాలు తిరిగి జేఎన్యూకు వెళ్లిపోగా, ఆమె మాత్రం సలీం ఇంటికి మళ్లీ వచ్చి అక్కడ మద్యం తాగిందని పోలీసులు తెలిపారు. తెల్లవారి లేచేసరికి సులేమాన్ తనపై బలవంతం చేస్తున్నట్లు ఆమెకు తెలిసింది. తాను మత్తులో పడి ఉన్నప్పుడు సలీం, సులేమాన్ తనపై అత్యాచారం చేసినట్లు అర్థమైంది. ఆమె జేఎన్యూ హాస్టల్కు తిరిగి వెళ్లిపోయి, జరిగిన విషయాన్ని తన స్నేహితులకు చెప్పగా, వెంటనే వారు ఆమెను పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. తర్వాత వైద్య పరీక్షల కోసం ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్న సలీంతో పాటు సులేమాన్ను కూడా పోలీసులు అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more