తన వల్లే సమాజ్ వాదీలో చిచ్చు, పైగా తండ్రి-కొడుకులు(ములాయం-అఖిలేష్) దూరం అవుతున్నారన్న భావనలో ఉన్న అమర్ సింగ్ కొద్దికాలంగా వాళ్లకి దూరంగా వెళ్లాలని డిసైడ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యూపీ ఎన్నికలు ముగిసేదాకా లండన్ చెక్కేసేందుకు ఫ్లాన్ కూడా వేసుకున్నాడు. అయితే అమర్ నిర్ణయం ప్రకటించిన కొన్ని గంటలకే, ములాయం సింగ్ యాదవ్ సంచలన ఆరోపణలను చేశాడు. అవసరమైతే తానే స్వయంగా అఖిలేష్ పై పోటీకి దిగుతానని నేతాజీ ప్రకటించాడు కూడా.
సమాజ్వాదీ పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ ములాయం, అఖిలేష్ వర్గాల్లో ఎవరికి చెందాలనే విషయం గురించి ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని ఈ రోజు వెలువరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయిన ములాయం ఈ వ్యాఖ్యలు చేశాడు. తన కుమారుడు రాష్ట్రంలోని ముస్లింలను రెచ్చగొడుతున్నాడని ములాయం వ్యాఖ్యానించారు. తాను సమాజ్వాదీ పార్టీని, తమ పార్టీ గుర్తును కాపాడుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నానని అయితే అఖిలేష్ తన మాటలను లెక్కచేయకపోతే, తాను ప్రత్యక్షంగా అతడిపై పోటీకి దిగుతానని ఆయన చెప్పారు.
అఖిలేష్తో చర్చించడానికి తాను ఆయనను ఇప్పటికి మూడుసార్లు పిలిచానని, కానీ అఖిలేష్ ఒక్క నిమిషం పాటు మాత్రమే ఉండి తాను చెప్పేది వినకుండానే వెళ్లిపోయాడని ఆయన చెప్పారు. తన బాబాయ్ రాంగోపాల్ చెప్పినట్లు నడుచుకుంటున్నాడని తెలిపాడు. అంతేకాదు తన కుమారుడు అఖిలేష్ బీజేపీతో పాటు పలు ప్రతిపక్షాలతో చేతులు కలిపాడని ఆయన ఆరోపించారు. అఖిలేష్కి తాను నచ్చజెప్పడానికి ప్రయత్నించానని అయినప్పటికీ ఆయన చేస్తోన్న తప్పులను తెలుసుకోవడం లేదని ములాయం సింగ్ అన్నారు.
తమ పార్టీ గుర్తు విషయంలో ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉన్నా దాన్ని ఆమోదిస్తామని తెలిపాడు కూడా. అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని ప్రకటించాడు. రోజురోజుకీ ముదురుతున్న వివాదం, కుటుంబ కలహాలు, రోజుకో మాట మారుస్తూ జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం ద్వారా, వచ్చే ఎన్నికల్లో ఎస్పీ భారీగా దెబ్బతినే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూపీలో ఫిబ్రవరి 11 నుంచి మార్చి 4 వరకు ఏడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more