దేశం నివ్వెరపోయింది.. పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్ లోకి వెళ్లి మరీ సర్జికల్ స్ట్రైక్స్ చేశామని భారత అర్మీ ప్రకటించిన తరువాత.. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు యదేశ్చగా భారత సరిహద్దు ప్రాంతంలోకి అక్రమంగా చొచ్చుకొస్తున్న వీడియో కలకలం రేపుతోంది. టెర్రరిస్టులు స్వేచ్ఛగా విహరించటంతో పాటు మంచు కొండల్లో స్నోబాల్ ఆటలతో ఎంజాయ్ చేయటం దేశ ప్రజలతో పాటు భారత అర్మీని కూడా ఒక్కసారిగా షాకింగ్ గురి చేసింది.
ఓ చేతిలో ఏకే 47తుపాకీ.. మరో చేతిలో మంచు ముద్దలను తమ తోటి ఉగ్రవాదులపైకి విసురుకుంటూ ఆడుకోవటం విస్మయానికి గురిచేసింది. జమ్మూకాశ్మీర్ బోర్డర్ లో మంచుపర్వతాలు దాటుకుని టెర్రరిస్టులు ఇండియాలోకి ప్రవేశిస్తున్నారు. 12 మంది ఉన్న తీవ్రవాద ముఠా.. చేతుల్లో AK 47 తుపాకులు ఉన్నాయి. నల్లటి దుస్తుల్లో ఉన్నారు. చలికి తట్టుకునే విధంగా పెద్దపెద్ద కోటులు ధరించి ఉన్నారు. మంచుకొండల్లో నడిచి వస్తూ.. మధ్యలో ఆగిన సమయంలో ఐస్ ముద్దలతో ఆటలాడారు.
జమ్మూ భద్రతా సిబ్బంది చేతికి అందిన ఈ వీడియోని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ వీడియో ఏ ప్రాంతంలో తీసిందన్న విషయమై దర్యాప్తు చేస్తున్నారు. అయితే మరో షాకింగ్ న్యూస్ ఏటంటే.. ఇన్నాళ్లుగా వేర్వేరుగా వున్న రెండు ఉగ్రవాద గ్రూపులు లష్కరే తోయిబా, హిజ్ బుల్ ముజాహిద్దీన్ లకు చెందిన ఉగ్రవాదలు అందులో వున్నారని, భారత్ లో అలజడి సృష్టించే విషయంలో ఈ రెండు తీవ్రవాద గ్రూపులు ఒక్కటయ్యాయని కూడా పోలీసుల పరిశీలనలో తేలింది. ఈ నెల 7న సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వీడియో కాశ్మీర్ లోనే సంచరిస్తూ వీడియోకు చిక్కారని, అయితే ఈ వీడియో ఎంతవరకు వాస్తమైనదో పోలీసులు నిర్థారించే పనిలో వున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more