అతను ఓ చట్టసభ ప్రతినిధి. అయినా ఇంకితం మర్చిపోయి మైనర్ విద్యార్థినులతో అభ్యంతకరమైన ప్రశ్నలు వేసి.. అత్యంత మొరటుగా వ్యవహరించారు. ఓ మైనర్ విద్యార్థి అత్యాచారానికి గురైన సందర్భంగా ఘటనాస్థలానికి వచ్చి.. పోలీసు అవతారం ఎత్తి ఇంటరాగేషన్ చేపట్టిన ఎమ్మెల్యే.. బాధితురాలు అత్యాచారానికి గురైందని ఎలా చెబుతారంటూ అర్థరహితమైన అభ్యంతరకరమైన ప్రశ్నలను వేశాడు. రక్తస్రావం ఎక్కడి నుంచి వస్తుంది?’ అంటూ ప్రశ్నించారు. బీజేపీ మిత్రపక్షమైన కేంద్రమంత్రి ఉపేంద్ర కుశ్వాహ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ సమతాపార్టీ ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్ ఇలా వికృత ప్రశ్నలు అడిగి విద్యార్థినులను ఇబ్బంది పెట్టారు.
బిహార్లోని వైశాలీలో ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే ఓ పదో విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయింది. ఆమె దుస్తులు రక్తంలో తడిసిపోయాయి. ఈ ఘటన నేపథ్యంలో హాస్టల్కు వచ్చిన ఎమ్మెల్యే పాశ్వాన్ తానే స్వయంగా విద్యార్థులను ప్రశ్నించి.. ఇంటరాగేషన్ మొదలుపెట్టారు. అభ్యంతరకరమైన ప్రశ్నలు అడిగిన ఆయన.. ’మీరు విద్యార్థులు. మీకు స్పష్టంగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీరు స్పష్టంగా చెప్పలేకపోతే.. రేపు మీపై అత్యాచారం జరగొచ్చు. రేపిస్టు మీ గదికే వస్తే మీరు ఏం చేస్తారు’ అంటూ ఆయన విద్యార్థినులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఆ తర్వాత ఉపాధ్యాయుల వైపు తిరిగి మీలో కూడా కొందరు రేపిస్టుకు సాయం చేసి ఉండవచ్చునని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగుచూడటం దుమారం రేపుతోంది. కొత్త రేపిస్టు కొంతమంది అమ్మాయిలకు తెలిసివాడే కావొచ్చునంటూ డిటెక్టివ్ అవతారం కూడా ఎత్తారు. ఇలా అందరి ముందు ఎమ్మెల్యే అడిగిన వికృత ప్రశ్నలకు విద్యార్థినులు బెదిరిపోయారు. కాగా బీహార్ వ్యాప్తంగా ఈ ఎమ్మెల్యే ప్రశ్నలవర్షంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బెంగళూరు కీచక పర్వం నేపథ్యంలో అక్కడి మంత్రితో పాటు సమాజ్ వాదీ నేతకు వ్యతిరేకంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. ఈ ఎమ్మెల్యే విషయంలో మాత్రం ఇంకా స్పందించలేదు. అధికార పార్టీకి మిత్రపక్షంగా వున్న ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్ కు నోటీసులు కూడా జారీ చేయలేదు. కర్ణాటక మంత్రి, సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేలు మహిళల వస్త్రాధారణపై వ్యాఖ్యలు చేయగా, ఏకంగా మైనర్ విద్యార్థుల వద్దకు వెళ్లి రేప్ బాధితురాలి స్నేహితురాళ్లకు అభ్యంతరకర ప్రశ్నలు సంధించి వారిని ఇబ్బందులకు గురిచేసిన ఎమ్మెల్యే విషయంలో ఎందుకు మౌనంగా వున్నారో వారికే తిలియాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more