అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టినంత మాత్రాన అమ్మ క్రేజ్ నీకు వచ్చేసినట్లు అనుకుంటున్నావా? అంటున్నారు ఆర్కే నగర్ నియోజక వర్గ ప్రజలు. జయ కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గం నుంచే శశికళ పోటీ చేయనుందన్న వార్తల నేపథ్యంలో వారు తీవ్రంగా మండిపడుతున్నారు. జయ సరిపోయి సరిగ్గా నిన్నటికి నెల కావటం, అన్నాడీఎంకే నేత వెట్రివెల్ అమ్మ స్థానం నుంచే పోటీ చేయాలని కోరటంతో ఆగ్రహించిన మహిళలు ర్యాలీ తీసి మహిళలు తమ నిరసన తెలిపారు.
చిన్నమ్మ ఆశలు పెట్టుకొని పెద్దగా ఊహించుకోద్దు. మా వద్దకు వచ్చి ఓట్లు అడగొద్దు. మేం ఇక్కడ ఉన్నామంటే అది అమ్మకోసమే' అంటూ నినదించారు. ఆర్కే నగర్ ప్రజలకు జయమ్మ అంటే ఎక్కడ లేని అభిమానం. ఆమె చనిపోవడంతో ప్రస్తుతం అదే చోటు నుంచి ప్రస్తుతం పార్టీ పగ్గాలు చేతబట్టి ముఖ్యమంత్రి పదవికై సాగుతున్న శశికళ పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ, ఇక్కడి ప్రజల నుంచి శశికళకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇది జయమ్మ చోటని, ఇక్కడికి శశిని అనుమతించం అంటున్నారు.
అయితే అనుహ్యాంగా అమ్మ జిరాక్స్ గా ముద్రపడిపోయిన ఆమె మేనకొడలు దీపకు మాత్రం వారంతా మద్ధతు ఇస్తున్నారు. 'మా అమ్మ (జయలలిత) 77 రోజులు ఆస్పత్రిలో ఉన్నారు. ఒక్కరోజైనా శశికళ మాకు చూపించారా. జయ మేనకోడలు దీపా జయకుమార్ మాత్రమే మా దగ్గర నుంచి పోటీ చేయాలి. ఆమె మాత్రం మా జయలలిత వారసత్వాన్ని కొనసాగించాల్సింది' అంటూ ఆర్కే నగర్ వాసులు అంటున్నారు. ఇప్పటి కొంతమంది గ్రూపులుగా వెళ్లి శశికళకు ఓట్లు అడగొద్దంటూ నేరుగా విజ్నప్తి చేసినట్లు కూడా సమాచారం.
అయితే దీని వెనుక డీఎంకే కుట్ర దాగి ఉందని వెట్రివేల్ చెబుతుండగా, దీపా ఇంటి బయట అన్నాడీఎంకే కార్యకర్తలు పడిగాపులు పడుతుండటం విశేషం. సమయం వచ్చినప్పుడు నా నిర్ణయం ప్రకటిస్తా. నన్నెవ్వరూ ఆపలేరంటూ దీప కూడా కామెంట్లు చేయటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మధుర నుంచి శశికళ పోటీ చేయించాలన్న ఆలోచనలో సీనియర్లు ఉన్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more