దేశంలోని అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగించిన కేంద్ర ఎన్నికల సంఘం.. దేశ ప్రజలకు సంబంధించిన ఒక్క అంశంతో పాటు అత్యంత పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రవాసులకు సంబంధించిన మరో అంశంపై మాత్రం ష్పష్టతను ఇవ్వలేదు. ముందుగా దేశ ప్రజలకు సంబంధించిన అంశమైన కేంద్ర బడ్జెట్ విషయంలో క్లారీటీ ఇవ్వని కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సమాధానం చెప్పగా, ఉత్తర్ ప్రదేశ్ అధికార సమాజ్ వాదీ పార్టీకి చెందిన సైకిల్ గుర్తును ఎవరికీ కేటాయిస్తున్నారన్న అంశంపై కూడా స్సష్టను ఇవ్వలేదు. ఈ అంశంలో గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి వుంటామని తెలిపింది.
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని భావిస్తున్న 2017-18 బడ్జెట్ పై చర్చించి, త్వరలో నిర్ణయాన్ని వెలువరిస్తామని ఈసీ నజీమ్ జైదీ వెల్లడించారు. 1న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న వేళ, పలు రాష్ట్రాల ప్రతిపక్షాల నుంచి తమకు అభ్యంతరాలు అందాయని అయన వెల్లడించారు. అందిన ఫిర్యాదులపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా, బడ్జెట్ ను ప్రతిపాదించేందుకు ఈసీ అంగీకరించకుంటే, బడ్జెట్ సమర్పణ మార్చి 11వ తేదీ తరువాతకు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సమాజ్ వాదీ ఎన్నికల గుర్తును ఎవరికీ కేటాయిస్తారన్న మీడియా ప్రశ్నకు సమాధానమిచ్చిన ఈసీ నజీమ్ జైదీ.. సైకిల్ గుర్తు తమకు కావాలని ములాయం సింగ్ యాదవ్ వర్గం, తమకే చెందాలని అఖిలేష్ వర్గం ఈసీని స్పందించాయని, ఈ మేరకు వారి వినతులు, సంబంధిత పత్రాలను సమర్పించాయని తెలిపారు. వీటన్నింటినీ పరిశీలిస్తున్నామని, గతంలో ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు ఈసీ వెల్లడించిన నిర్ణయాలను గురించి తెలుసుకుని, చట్టాలను పరిశీలించిన తరువాత తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని జైదీ వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more