ప్రేమ పేరుతో వంచించే మృగాల్లు వున్న ఈ సమాజంలోనే పెళ్లి పేరుతో మోసానికి తెరతీసే తోడేళ్లు కూడా వుంటాయని తెలియని అమాయక అబలలు అలాంటి మగమృగాళ్ల చేతికి చిక్కిశల్యమైన ఘటన ఇది. త్వరలో మనం బార్యభర్తలం కాబోతున్నామంటూ యువతులను నమ్మించి.. వారిని లొంగదీసుకుని అవసరం తీరగానే ప్లేటు ఫిరాయించిన ప్రబుద్ధుడ్ని ఎట్టకేలకు పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన హారాష్ట్రలోని పుణేలో చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని బారామతికి చెందిన అమిత్ జాదవ్ ఉద్యోగ రీత్యా పుణేలో ఉంటున్నాడు. గతేడాది ఏప్రిల్లో మ్యారేజ్ బ్యూరో వెబ్సైట్లో తాను సాప్ట్వేర్ ఇంజనీర్ అంటూ ప్రకటన ఇచ్చాడు. ఆన్లైన్లో వివరాలను చూసిన పుణేకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువతి అమిత్ను సంప్రదించింది. ఇద్దరికి నచ్చడంతో మొబైల్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకుని తరచూ మాట్లాడుకునే వారు. అలా ఇద్దరి మధ్య కొంత సన్నిహిత్యం ఏర్పడింది.
ఒకరోజు తాను సంస్థ తరఫున రెండేళ్ల పాటు విదేశాలకు వెళుతున్నానని, ఈలోగా నిశ్చితార్థం చేసుకుందామని ఆ యువతికి తెలిపాడు. ఆ తర్వాత ఆమెను రావత్లోని తన ఫ్లాటుకు పిలిపించి పలుమార్లు అత్యాచారం చేశాడు. వీసా కోసమంటూ ఆ యువతి దగ్గర డబ్బు తీసుకున్నాడు. రెండు నెలల గడిచాక బాధితురాలిని వివాహం చేసుకోనని అమిత్ చెప్పాడు. అయితే తన దగ్గర తీసుకున్న డబ్బు ఇవ్వమని ఆమె అడిగితే ఇవ్వడానికి నిరాకరించాడు.
దీంతో ఆమె మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మరో యువతితో కలిసి ఉన్న సందర్భంలో అమిత్ను పుణే రైల్వే స్టేషన్లో పోలీసులు పట్టుకున్నారు. దీనిపై ఆ యువతిని పోలీసులు ప్రశ్నిస్తే అతడిపై ఫిర్యాదు చేయడానికి ఆమె నిరాకరించింది. గతంలో నిందితుడు ఇలాగే పెళ్లి చేసుకుంటానని చెప్పి మరో నలుగురు యువతులను మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more