అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇవాళ శశికళ బాధ్యతలు స్వీకరించారు. పోయెస్ గార్డెన్ నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు జయలలిత వాడిన కారులోనే శశికళ వెళ్లారు. పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు ‘చిన్నమ్మ..చిన్నమ్మ’ అంటూ నినాదాలు చేశారు. శశికళ ఫొటోలు, నినాదాలు ఉన్న టీ-షర్టులను ధరించిన ఆమె అభిమానులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అమె కార్యకర్తలను ఉద్దేశించి తొలిసారి మాట్లాడారు. జయలలిత మరణాన్ని ఇప్పటికే తాము జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. అమ్మ చూపిన బాటలోనే నడుస్తానని ఆమె చెప్పారు. అమ్మ ఎప్పటికీ తన హృదయంలోనే ఉంటారని కంటతడి పెడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
అమ్మ చేపట్టిన పనుల్ని చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళతామని శశికళ స్పష్టం చేశారు. ప్రజల కోసమే ఈ పార్టీ అని అన్నారు. జయ ఆశయాల సాధనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. జయ చూపిన బాటలోనే పార్టీ నడుచుకుంటుందని స్పష్టం చేశారు. అమ్మే మన శక్తి, మన ధైర్యం అని చెప్పారు. అమ్మే చూపిన బాటే మనకు మార్గదర్శి అని అన్నారు.అమ్మతో తనది 33ఏళ్ల అనుబంధమని కంటతడి పెట్టారు. నెచ్చెలి మరణాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. జయలలిత మరణిస్తారని ఊహించలేదని అన్నారు.
ఆస్పత్రిలో ఓ దశలో అమ్మపూర్తిగా కోలుకున్నారని.. ఆ సమయంలోనే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అమ్మ మనకు దూరమయ్యారని తెలిపారు. జయ మరణంతో సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మన సంస్కృతి, సాంప్రదాయాలంటే జయకు చాలా ఇష్టమని, వాటిని కాపాడేందుకు తన వంతుగా ప్రయత్నిస్తానని చెప్పారు. కాగా, శశికళ మాట్లాడుతున్నంత సేపు కూడా నేతలు, కార్యకర్తల చప్పట్లు కొడుతూ ఆమెకు మద్దతు తెలిపారు. అనంతరం పార్టీ ఆఫీసు ముందుకు వచ్చిన చిన్నమ్మ.. తరలివచ్చిన నేతలు, కార్యకర్తలకు అభివాదం తెలిపారు..
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more