అరుణాచల్ ప్రదేశ్లో మరోమారు అధికార పార్టీకి అ పార్టీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఫెమా ఖండూను అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ (పీపీఏ)కు భారీ షాక్ తగిలింది. శనివారం ఆ పార్టీకి చెందిన 33 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీజేపీలో చేరారు. దీంతో 60 మంది సభ్యులున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో పీపీఏకు 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు.
అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలపై పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ప్రదేశ్(పీపీఏ) వేటు వేయడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడిన నాటి నుంచి పరిణామాలు మారుతున్నాయి. నాయకత్వ మార్పు తప్పదని పీపీఏ వెల్లడించింది. అయితే ఖండూ చెప్పినట్టుగా ఆయన మద్దతుదారులు తిరుగుబాటు చేయడంతో పీపీఏకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఖండూ సహా 33 మంది ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరారు. బీజేపీ ఖండూకే తమ మద్దతు ప్రకటించింది. బీజేపీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఖండూకు అసెంబ్లీలో పూర్తి మెజార్టీ లభించినట్టయ్యింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more