పాత పెద్ద నోట్ల రద్దు తరువాత పేదల అకౌంట్లలోకి డబ్బు అటోమెటిక్ గా వస్తుందని, అయితే వాటని పేదలు మాత్రం తిరిగి ఇవ్వవద్దని ప్రధాని మంత్రి నరేంద్రమోడీ సెలవిచ్చినట్లగానే జరుగుతుంది కానీ., పెద్దలు వచ్చి పేదలను డబ్బులు ఖాతాలో వేసుకోండీ అని అడగకుండానే కొందరి పేదల అకౌంట్లలో డబ్బు చేరుతుంది.. అలాగే వారి ప్రమేయం కానీ, అనుమతి కానీ లేకుండానే ఏకంగా వారి అకౌంట్లలోనుంచి డబ్బు తరలివెళ్లిపోతుంది. ఇటీవల పంజాబ్ లోని టాక్సీ డ్రైవర్, ఆ తరువాత ఓ మహిళ, ఇలా పలు కథనాలు విన్న ప్రజలకు ఏకంగా మన అంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇలా జరిగిందని తెలిస్తే.. అవ్వాకవుతారు
ఓ రైతు ఖాతాలో అతని అనుమతి లేకుండానే రూ.కోటి జమ అవుతూ.. డ్రా అవుతున్న చిత్రమిది.. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ తంతు కొనసాగుతోంది. రైతు ఖాతాలో డబ్బులు జమవుతున్నట్టు.. అలాగే డ్రా అవుతున్నట్టుగా మొబైల్ నంబర్కు మెసేజ్లు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... కర్నూలు జిల్లా పెద్దకడబూరు గ్రామానికి చెందిన అబ్రహం అనే రైతుకు అక్కడే ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంక్లో ఖాతా ఉంది. ఇతని బ్యాంక్ అకౌంట్లో ఈ నెల 24వ తేదీ నుంచి రోజూ భారీమొత్తంలో నగదు జమ అయి.. విత్డ్రా అవుతున్నట్టుగా అతని సెల్కు మెసేజ్లు వస్తున్నాయి.
వాటిని చూసి భయపడిన అబ్రహం.. తనకు తెలిసిన వ్యక్తి అయిన ఎమ్మిగనూరుకు చెందిన మల్లెల ఆల్ఫ్రెడ్రాజుకు శుక్రవారం రాత్రి తెలిపాడు. దీంతో ఆల్ఫ్రెడ్రాజు.. ఈ విషయాన్ని విలేకరులకు తెలియజేశారు. రైతు సెల్ నంబర్ 9989050379కు వస్తున్న మెసేజ్లను చూపించారు. ఇప్పటివరకు 68 మెసేజ్లు వచ్చాయన్నారు. 30వ తేదీ ఉదయం 11.24కు రూ.1,96,07926 జమ అయినట్లు.. సాయంత్రం 5.44కు రూ.1,33,48781 డ్రా అయినట్లు సెల్కు వచ్చిన మెసేజ్ను చూపించారు. ఈ నగదు ల్యాన్ కో అమర్ కంటక్ పవర్ లిమిటెడ్ పేరున అబ్రహం అకౌంట్లో జమవుతోంది. ఈ భారీ మోసంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరముంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more