తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేతి జయలలిత మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన మద్రాసు హైకోర్టు నోటీసులిస్తే వాటికి తాము సమాధానాలు ఇస్తామని కేంద్ర మంత్రి వెంక్యనాయుడు అన్నారు. జయలలిత అకస్మిక మరణం నేపథ్యంలో అనుమానాలను వ్యక్తం చేసిన రాష్ట్రోన్నత కోర్టు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. న్యాయస్థానంపరిధిలో వున్న అంశంపై తాను ఇంతకంటే అధికంగా మాట్లాడలేనని అన్నారు. జయలలిత మృతి అపోలో అస్పత్రి వర్గాలు, ఎయిమ్స్ వైద్యులు చెప్పిన విషయాలను తాము నమ్ముతున్నామని వెంకయ్య అన్నారు.
కాగా జయలలిత మృతిపై దాఖలైన పిటీషన్లను ఇవాళ విచారించిన న్యాయస్థానం సదరు పిటీషన్లను వెకేషన్ కోర్టు నుంచి రెగ్యూలర్ కోర్టుకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా న్యాయస్థానం జయలలిత మీతిపూై అనుమానాలు వ్యక్తం చేశారు. తనుకు కూడా వ్యక్తిగతంగా అనుమానాలున్నాయని న్యాయమూర్తి జస్టిస్ వైద్యలింగం పేర్కొన్నారు. జయ మృతదేహాన్ని మళ్లీ పరీక్షించాలని తామేందుకు ఆదేశించకూడదని ప్రశ్నించారు. జయ మరణం తర్వాతైనా వాస్తవాలు వెల్లడించాలని, అరుంబాక్కంకు చెందిన జోసెఫ్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది.
జయలలిత మరణంపై మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు బాధాకరమని అన్నాడీఎంకే నాయకురాలు సీఆర్ సరస్వతి అన్నారు. జయ మృతిపై అనుమానాలున్నాయని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వైద్యలింగం వాఖ్యానించిన నేపథ్యంలో ఆమె స్పందించారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వమే సమాచారం తీసుకుందని వెల్లడించారు. న్యాయస్థానం అవసరమనుకుంటే కేంద్రం నుంచి సమాచారం తెప్పించుకోవచ్చని సూచించారు. శశికళ నాయకత్వ పటిమ గురించి జయలలితే పలుమార్లు చెప్పారని సరస్వతి గుర్తు చేశారు. చిన్నమ్మ.. అమ్మ ప్రతిరూపమని, ఆమె పార్టీని సమర్థవంతంగా నడపగలరని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more