దేశంలో వున్న బంగారు అభరణాలలో 47 శాతం ముత్తూట్ ఫైనాన్స్, మణపురం ఫైనాన్స్ లలోనే వుందని వార్తలతో దోపిడీ దోంగల దృష్టి ఆయా సంస్థలపై పడిందా..? అంటే అవునన్నట్లుగానే జరుగుతున్నాయి వరుస ఘటనలు. సరిగ్గా గుజరాత్ లోని దోరజీ పట్టణంలో సొమవారం ముత్తూట్ ఫైనాన్స్ పై దోపిడి చేసి 24 గంటల వ్యవధిలోనే మరోమారు తెలంగాణలోని ముత్తూట్ సంస్థపై దొపిడికి పాల్పడ్డారు. సోమవారం బ్యాంకు కార్యకలాపాలు సాగుతున్న వేళ ముగ్గురు అగంతకులు సంస్థలోకి ప్రవేశించి.. మరణాయుధాలు, రివాల్వర్ తో బెదిరించి దోపిడికీ పాల్పడి 4.8 కేజీ బంగారు అభరణాలను ఎత్తుకుపోయారు.
సరిగ్గా అలాంటి ఘటనే హైదరాబాద్ పరిధిలోని సంగారెడ్డి జిల్లా.. రామచంద్రాపురంలోని తొమ్మిదవ జాతీయ రహదారిపై రామచంద్రారెడ్డి నగర్ లోవున్న ముత్తూట్ ఫైనాన్స్ లో గత రాత్రి జరిగింది. సీబిఐ అధికారులమంటూ అక్కడి సెక్యూరిటీ గార్డును నమ్మించి లోనికి ప్రవేశించిన దుండగులు.. ముత్తూట్ శాఖలోకి ప్రవేశించిన లాకర్లలోని బంగారాన్ని ఎత్తుకేళ్లారు. ఎందుకలా చేస్తున్నారని అడిగిన సెక్యూరిటీని మరణాయుధాలతో బెదిరించారు. ఆ తరువాత ఆయనను బ్యాంకులోనే బంధించారు. కాగా సుమారుగా పది కోట్ల రూపాయల విలువైన 50 కిలోల బంగారు నగలను అపహరించుకుపోయారు.
సీసీ కెమెరాల్లో నమోదైన వివరాలను బట్టి ఎరుపు రంగు స్కార్పియోలో వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. మారణాయుధాలతో వచ్చిన వీరు సెక్యూరిటీ గార్డును బెదిరించి, బంధించి దోపిడీకి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం బ్యాంకు సిబ్బంది వచ్చి సెక్యూరిటీ గార్డును విడిపించి రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు దోపీడీ జరిగిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, క్లూస్ టీమ్ ఘటనాస్థలికి వచ్చి పరిశీలిస్తున్నారు. ఇది పాత నేరస్తుల పని అయివుండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఇదిలావుండగా, సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం కూడా ఇదే ముత్తూట్ పైనాన్స్ సంస్థలో ఉగ్రవాదులు దోపిడీకి పాల్పడ్డారు. మధ్య ప్రదేశ్ లోని తాండ్వా జైలు నుంచి తప్పించుకుని వచ్చి ఉగ్రవాదులు.. బీరంగూడ కమాన్ చెంతనున్న ఈ సంస్థపై రెక్కీ నిర్వహించి.. ఆ తరువాత అదను చూసి దోపిడీకి పాల్పడ్డారు. అయితే దోంగతనానికి పాల్పడిన ఉగ్రవాదులందరన్నీ.. నల్గొండ జిల్లా పోలీసులు ఎదురు కాల్పుల్లో హతమర్చిన విషయం తెలిసిందే.
అయితే ఈ సారి కూడా ఉగ్రవాదులే ఈ దోపిడికీ పాల్పడ్డారా..? లేక ఇది దోంగల పనేనా..? పాత నేరస్థులేనా..? గుజరాత్ లో దోపిడికి పాల్పడిన వ్యక్తులే ఇక్కడ కూడా దోపిడీకి పాల్పడ్డారా.. అక్కడి నేరం జరగగానే తప్పించుకుని నేరుగా రామచంద్రాపురం వచ్చి ఇక్కడ ముత్తూట్ సంస్థపై కూడా దోపిడికి పాల్పడ్డారా..? అన్న కోణంలో సైబరాబాద్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more