పెద్దనోట్ల రద్దు అనంతరం దేశ వ్యాప్తంగా అధికారులు జరుపుతున్న దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీ, నోయిడాలలోని శ్రీ లాల్ మహల్ లిమిటెడ్ సంస్థ కార్యాలయాలలో విస్తృతంగా తనిఖీలు చేసిన అధికారులు ఇంతవరకు ఎక్కడా గుర్తించనంత భారీ మొత్తంలో బంగారాన్ని, నగదును స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ, ఐటీ అధికారులు నిర్వహించిన ఈ దాడిలో ఏకంగా రూ.120 కోట్ల విలువైన 430 కిలోల బంగారం పట్టుబడింది. అంతేగాక, 2.48 కోట్ల పాతనోట్లు, రూ.12 లక్షల కొత్తనోట్లు, 80 కిలోల వెండి, మరో 15 కిలోల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆయా ప్రాంతాల్లోని శ్రీ లాల్ మహల్ లిమిటెడ్ అనే కమోడిటీస్ ట్రేడింగ్ కంపెనీ యజమానుల కార్యాలయాలు, ఇళ్లపై ఏక కాలంలో ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ కంపెనీ యజమానులు ప్రత్యేక ఆర్థిక నిబంధనల ప్రకారం డ్యూటీ ఫ్రీ పద్ధతిలో బంగారాన్ని భారీ మొత్తంలో దిగుమతి చేసుకొని ఇంత పెద్ద మొత్తంలో అక్రమార్జన చేశారని అధికారులు తెలిపారు. ఈ కంపెనీల్లో తవ్విన కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయని, ఇవే కార్యాలయాల్లో నడుస్తున్న మరో కంపెనీకి ఇక్కడి నుంచి భారీ మొత్తంలో ఆన్లైన్ బదిలీ ద్వారా డబ్బు సరఫరా అయినట్లు అధికారులు చెప్పారు.
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఒక బ్యాంకు ఖాతాలో నగదు జమచేసుకొని, మరో కంపెనీకి బదిలీ చేయడం లాంటి అక్రమాలను ఐటీ అధికారులు గుర్తించారు. ఇలా బదిలీ అవుతున్న నగదు ద్వారానే బంగారు నాణేలను, కడ్డీలను ప్రభుత్వ రంగ సంస్థ అయిన మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి వీరు కొనుగోలు చేసి, దాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించడానికి సన్నాహాలు చేశారు. ఆ బంగారాన్ని బయటి మార్కెట్లో పాతనోట్లు ఉన్న నల్లకుబేరులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఈ కేసులో ఇద్దరు అక్రమార్కులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. కాగా కంపెనీ డైరెక్టర్లు తమకు ఆరోగ్యం బాగోలేదంటూ విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more