లిబియాకి చెందిన ఆఫ్రీకియా ఎయిర్ లైన్స్ కు చెందిన ఏ-320 విమానం హైజాక్ కథ సుఖాంతం అయింది. సెభా నుంచి ట్రిపోలికి 118 మందితో వెళ్తుండగా ఈ విమానాన్ని ఇద్దరు దుండగులు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాన్ని మాల్టా దీవిలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం భద్రతా దళాలు విమానాశ్రయాన్ని చుట్టుముట్టగా, విమానాశ్రయానికి రాకపోకలు నిలిపేశారు.
వెంటనే మాల్టా ప్రధాని జోసెఫ్ మస్కట్, లిబియా ప్రధాని ఫయీజ్ అల్ సెర్రాజ్ తో మాట్లాడారు. అనంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూం నుంచి వైమానిక, భద్రత ఇతర ఉన్నతాధికారులు ఫోన్ల ద్వారా హైజాకర్లతో చర్చించారు. ఈ క్రమంలో తొలుత ఒక శిశువు, 28 మంది మహిళలను వదిలిపెట్టిన హైజాకర్లు, తరువాత సిబ్బందిని మాత్రమే బందీలుగా ఉంచుకుని ప్రయాణికులందర్నీ విడిచిపెట్టారు. అనంతరం చర్చల్లో పురోగతి సాధించడంతో వారిని కూడా విడిచిపెట్టి భద్రతా దళాలకు లొంగిపోయారు. దీంతో కథ సుఖాంతమైంది.
ఇక తాజా పరిణామాల నేపథ్యంలో మాల్టా ఎయిర్పోర్టులో హైఅలర్ట్ ప్రకటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కొన్ని విమానాలను రద్దుచేసి, మరికొన్నింటిని దారి మళ్లించారు. మరో 24 గంటల్లో సర్వీసులను పునరుద్ధికరీస్తామని అధికారులు తెలిపారు. కాగా, అదే సమయంలో ఓ సినిమాకు సంబంధించిన హైజాక్ షూటింగ్ జరగాల్సి ఉండగా, ఈ రియల్ సంఘటనతో వాళ్లు వణికిపోయారు. 1976 జరిగిన ఇజ్రాయిల్ దళాలు 150 బందీలను విడిపించేందుకు చేసిన ఆపరేషన్ నేపథ్యంలో ఆ చిత్రం తెరకెక్కించేందుకు ఎయిర్ పోర్ట్ లో షూటింగ్ చేయాల్సి ఉందని యూనిట్ చెబుతోంది.
ఇక హైజాకింగ్ కు కారణాలు తెలియరాకపోయినా, వారి దగ్గరి ఉన్న ఆయుధాలు మాత్రం డమ్మీ వని తేలి భద్రతా సిబ్బంది నిర్ఘాంతపోయారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more