కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రత్యర్థుల పాచికలు పారకుండా మరోమారు రాష్ట్రంలో అధికారాన్ని తమ పార్టీయే చేపట్టేందుకు అనువైన దిశగా పావులు కదుపుతున్నారు ముఖ్యమంత్రి సిద్దరామయ్యా. మరో మూడు నెలల్లో ఎన్నకలు రానున్న ఉత్తర్ ప్రదేశ్ లో 17 బిసీ కులాలను ఎస్సీ జాబితాలోకి చేర్చి కులం కార్డులో ఓట్లను కొల్లగొడుదామని అఖిలేష్ ప్రభుత్వం భావిస్తుండగా, కులం కార్డుకన్నా ప్రాంతీయ కార్డుకే ఓట్లు ఎక్కువ అనుకున్నారో ఏమో కానీ ఏకంగా ప్రాంతీయత కార్డును వేసి ఓట్లను గుమ్మరించుకునేందుకు రెడీ అయ్యింది కర్ణాటక సర్కార్.
2017 ద్వితీయార్థంలో ఎన్నికలకు వెళ్లనున్న కర్ణాటక సర్కార్ నిరుద్యోగులకు, యువతకు గాలం వేసింది. దేశంలో ఐటీ కేంద్రాలలో ఒకటిగా బాసిల్లుతున్న బెంగళూరు అనేక రాష్ట్రాల వారిని అకర్షిస్తుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు అనేక రాష్ట్రాల ప్రజలు బెంగుళూరుకు వలసవెళ్లి.. అక్కడ స్థిరపడ్డారు. దీనికి కారణం బెంగళూరులో ఐటీతో పాటు ఇతర పరిశ్రమలు కూడా విపరీతంగా ఉండడమే. చదువురాని వాళ్లకు కూడా ఏదో ఒక చిన్న బడ్డీ కోట్టు పెట్టుకుని బతుకు బండిని నడుపుదామని భావించి వెళ్లారు.
మరీ ముఖ్యంగా బెంగళూరు వాతవరణం అందరికీ అనుకూలంగానే వుంటుంది. అహ్లాదకర వాతావరణంలో మంచి ఉద్యోగం లభిస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు. దీంతో ప్రస్తుతం బెంగళూరు అందరినీ అకర్షిస్తుండగా, దీనికి కళ్లెం వేయబోతుంది కర్ణాటక ప్రభుత్వం ఇన్ఫార్మేషన్ టెక్నాలజీ (ఐటీ), బయో టెక్నాలజీ (బిటీ) మినహా అన్ని ప్రైవేటు రంగాల పరిశ్రమల్లోనూ కర్ణాటక వాసులకు మాత్రమే ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించాలని సవరణలను చేయబోతోంది.
1961 పారిశ్రామిక చట్టంలో ఇందుకు అవసరమమైన మార్పులను చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం కర్ణాటక అసెంబ్లీలో త్వరలోనే ఒక బిల్లును కూడా పెట్టాలని, దానిని అమోదిస్తూ తీర్మాణం చేసిన తరువాత అమలుపర్చే దిశగా చర్యలు తీసుకోవాలని భావిస్తుంది. అయితే ఆ సవరణ చట్టంతో కర్ణాటకలో జన్మించిన వారికి లేదా.. కర్ణాటకలో 15 ఏళ్లుగా నివాసముంటున్న వారికి, అందునా కన్నడంలో రాయడం, చదవడం, మాట్లాడటం వచ్చిన వారికి మాత్రమే ఉద్యోగాలు లభించేవిధింగా మర్పాలు చేర్పులు చేసినట్లు సమాచారం. ఇదే జరిగితే ఇకపై కన్నడీగులకు ఉద్యోగాలే. ఉద్యోగాలు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more