పెద్ద నోట్లు రద్దుతో జన్ ధన్ ఖాతాల్లో ఒక్కసారిగా పెరిగిన డిపాజిట్లు ఎగసిన కెరటాన్ని తలపిస్తే.. మరో 8 రోజులు మాత్రమే పాత నోట్ల డిపాజిట్లకు సమయం వున్న నేపథ్యంలో అవి ఇంకాస్త పెరుగుతాయన్న కేంద్ర అర్ధిక శాఖ, అర్భీఐ అధికారుల అంచాలు అవిరయ్యాయి. వెల్లువలా వచ్చిన డిపాజిట్లు రూ.75 వేల కోట్ల మార్కుకు చేరువలో ఎగిసి.. ఇక తగ్గడం ప్రారంభించాయి. తుది గడువు దగ్గపడుతుండటంతో పాటు జన్ ధన్ అకౌంట్లలో మరింత డబ్బు జమ అవుతుందని ఆవించిన అధికారుల ఆంచానాలకు బ్రేకులు పడ్డాయి.
జన్ ధన్ ఖాతాల్లోని డబ్బు క్రమంగా తగ్గడానికి ఆర్బీఐ తీసుకొస్తున్న నిబంధనలు కారణం కగా, ఆర్బీఐతో పాటుగా కేంద్ర ఆర్థికశాఖ అధికారులు సైతం జారీ చేసిన హెచ్చరికలు కూడా కారణంగా స్పష్టం అవుతోంది. పెద్ద నోట్లు రద్దు ప్రకటన నేపథ్చేయంలో నవంబర్ 9న రూ.45,636 కోట్లగా ఉన్న ఈ అకౌంట్లో డిపాజిట్లు నవంబర్ 23 వరకు రూ.72,843 కోట్లకు ఎగిశాయి. సుమారుగా రూ.74,609 కోట్లు వరకు చేరిన డిపాజిట్లు అక్కడి నుంచి రివర్స్ ట్రెండ్ లో పయనిస్తున్నాయని వెల్లడవుతోంది.
ఈ అకౌంట్లు దుర్వినియోగానికి వాడకుండా ఉండేందుకు జన్ ధన్ అకౌంట్ హోల్డర్స్ వివరాలను తమకు అందించాలని మొదటి సారి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సైతం బ్యాంకులను ఆదేశించింది. ఈ అకౌంట్లలో రూ.50వేల కంటే అధిక మొత్తాన్ని డిపాజిట్ చేస్తున్న వారి దగ్గర కేవైసీ తీసుకోవాలని బ్యాంకులకు సూచించింది. అంతేకాక ఈ అకౌంట్లతో లింక్ అయి ఉన్న ఇతరాత్ర ప్రయోజనాలను వారు కోల్పోయే అవకాశముందని వార్తలు వినిపించడంతో అకౌంట్లలో డిపాజిట్ తగ్గడం ప్రారంభమైయ్యాయి. పన్ను పరిమితుల కంటే తక్కువగా ఉండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయని జన్ ధన్ అకౌంట్లోని లెక్కలో చూపని రూ.1.64 కోట్ల డిపాజిట్ అయినట్టు ఐటీ శాఖ గుర్తించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more