‘‘దమ్ముంటే నిజాలు భయటపెట్టండీ’’ అని అడగరేం Rahul Gandhi bluffing on having information on PM Modi

Frustrated rahul gandhi bluffing on having information on pm modi

Demonetisation, Rahul Gandhi, PM modi, Ananth Nag, Venkaiah Naidu, Parliament, black money, Congress, BJP, high-value bank notes, BSP, SP, Notes Ban, Demonetisation, Rs 500 and 1000 notes banned, Old 500 Rupee Notes

Where was Rahul Gandhi for the last 20 days of the winter session of parliament, asked senior union minister Ananth Kumar of the BJP

‘‘దమ్ముంటే నిజాలు భయటపెట్టండీ’’ అని అడగరేం

Posted: 12/14/2016 03:33 PM IST
Frustrated rahul gandhi bluffing on having information on pm modi

పెద్ద నోట్ల రద్దు వెనుక దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అతిపెద్ద కుంభకోణానికి ప్రధాని తెరతీశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రమైన అరోపణలు చేసిన నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి నేతలు మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కించే పనిలోనే వున్నారు. కేంద్రంలో అధికారంలో వున్న పార్టీల నేతలు తమ ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి 120 కోట్ల మంది బలం, బలగం వున్నాయని, అందుచేతే సుమారు ముఫ్పై ఏళ్లకు పైగా పార్లమెంటు కనీవినీ ఎరుగని సీట్లతో అయనను గెలిపించారని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ అన్నారు.

పెద్దనోట్లు రద్దు చేసిన సుమారు నెల రోజుల తరువాత ఇవాళ అకస్మాత్తుగా రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రి వ్యక్తిగత అవినీతి గురించి తనవద్ద పక్కా ఆధారాలున్నాయని చెబుతున్నారని, మరి గత 20 రోజులుగా అయన తన వద్దనున్నా అధారాలతో ఏం చేశారని ఎదురు ప్రశ్నించారు. ఇంతకాలం ఆ ఆధారాల గురించి ఎందుకు మాట్లాడలేదని, పార్లమెంటులో ఆ ఆధారాలను ఎందుకు బయటపెట్టలేదని కేంద్ర మంత్రులు మండిపడ్డారు. ప్రధానమంత్రి మోదీపై రాహుల్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, ఆయన సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని అనంతకుమార్ అన్నారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి తాము చర్చకు సిద్ధమేనని చెబుతున్నామని.. కానీ దురదృష్టవశాత్తు ప్రతిపక్షం మాత్రం సభను నడవనివ్వడం లేదని ఆయన అన్నారు. నిజంగా రాహుల్ గాంధీ దగ్గర అంత భూమి బద్దలయ్యే సమాచారమే ఉంటే.. గడిచిన 20 రోజుల నుంచే ఆయన బయటపెట్టచ్చు కదా అని అనంతకుమార్ ప్రశ్నించారు. ఇప్పటివరకు ఆయన అలా భూకంపం తెప్పించే విషయాలేవీ ప్రస్తావించలేదని.. బయటకు వచ్చి మాత్రం తనను మాట్లాడనివ్వడం లేదని అంటున్నారని ఎద్దేవా చేశారు. అయితే విపక్షాలకు చెందిన ఎంపీలు, నేతలు ఓ జాతీయ మీడియా స్టింగ్ అపరేషన్ లో చిక్కడంతో తమ అసహనాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో రాహుల్ ఇలా చెబుతున్నారని విమర్శించారు.

ప్రజలకు నీతి సూక్తులు చెబుతూ అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఏకంగా ప్రధాని నరేంద్రమోడీపై విపక్షానికి చెందిన నేత రాహుల్ గాంధీ తీవ్రమైన అరోపణలు సంధించిన క్రమంలో బీజేపి నేతలు నుంచి వస్తున్న రెస్పాన్స్ మాత్రం కొంచెం తక్కువేనని చెప్పాలి. రాహుల్ గాంధీ తన వద్ద సాక్ష్యాధారాలు వున్నాయని, తేల్చిచెప్పిన క్రమంలో బీజేపి నేతలు ఎంతలా స్పందించాలని..? కానీ ఒకరిద్దరు మినహా అందరూ మౌనంగా వుండటానికి గల కారణాలు ఏంటన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

రాహుల్ గాంధీ బాడీ లాంగ్వేజ్ పరిశీలిస్తే అతని వద్ద ప్రధానికి సంబంధించిన ఏదో సమాచారం వుందనేలా కనిపిస్తున్నా..? అది నిజమా.? కాదా..? అని తేలావరకైనా తమ నేతకు అండగా వుండాల్సిన బీజేపి నేతలు ఎందుకలా దూరమవుతున్నారన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. దమ్ముంటే మీ వద్ద వున్న అధారాలను భయటపెట్టు.. మా నేతకు సంబంధించిన సమస్త సమాచారంపై బయట పెట్టు అని డిమాండ్లు రావాల్సిన సమయంలో ఢిఫెన్స్ లోకి బీజేపి నేతలు ఎందుకు వెళ్తున్నారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అవినీతి జరిగిందా.? అధారాలు వున్నాయా..? అన్న విషయాలను పక్కనబెడితే.. దాదాపు 10 ఏళ్ల తరువాత పార్టీని బ్రహ్మండమైన మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చిన వ్యక్తిపై వచ్చిన అరోపణలను ఖండించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Demonetisation  Rahul Gandhi  PM modi  Parliament  black money  Congress  BJP  

Other Articles