గుజరాత్ అహ్మదాబాద్ లో ఓ వ్యాపారవేత్త మాయం కావటం తీవ్ర కలకలాన్నే రేపుతోంది. ఎందుకంటే 13 వేల కోట్ల బ్లాక్ మనీతో ఈ అక్టోబర్ లో ఆయన ఐటీ శాఖకు దొరికిపోయాడు కాబట్టి. 45 ఏళ్ల మహేష్ షా అనే బిజినెస్ మెన్ స్వచ్ఛంద ఆదాయ వెల్లడి సమయానికి తన ఆస్తిని ప్రకటించాడు. అయితే అదంతా బ్లాక్ మనీ అని ఆదాయపు శాఖ అధికారులు తేల్చేశారు.
ప్రస్తుతం ఆ కేసులో విచారణ కొనసాగుతుండగా, ఆయన అదృశ్యం కావటం చర్చనీయాంశంగా మారింది. 12వ తరగతి చదివిన ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి మహా మేధావి అని ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ చెబుతున్నాడు. అసలు షా కనిపించడం లేదని కూడా ఆ సీఏ షెత్నా నే ఫిర్యాదుచేశాడు. దాంతో పోలీసులు, ఐటీ అధికారులు ఆయన ఇళ్లు, కార్యాలయాలన్నింటిలో సోదాలు చేశారు.
అపాజీ అమీన్ అనే సీఏ సంస్థ భాగస్వామి తెహముల్ షెత్నా వద్దకు వెళ్లి ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్) గురించి మహేష్ అడిగాడంట. ఆ తర్వాత సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసిపోతుందనగా.. అదేరోజు రాత్రి 11.55 గంటలకు ఆయన అహ్మదాబాద్లోని ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి వెళ్లి, తన వద్ద రూ.13,680 కోట్ల ఆస్తి ఉందని చెప్పారు.
మరో ఐదు నిమిషాల్లో పథకం గడువు ముగిసిపోతుందని, తనకు మనశ్శాంతి కావాలని, అందుకే తాను మొత్తం ఆస్తి వివరాలు చెప్పేస్తానని ఆయన అన్నట్లు సీఏ షెత్నా చెప్పారు. వెల్లడించినదంతా నగదు రూపంలోనే ఉండటం, అది చాలా పెద్దమొత్తం కావడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు ఆ మొత్తాన్ని ఆయన ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్లేందుకు కూడా అంగీకరించారు. దానికి సంబంధించిన రహస్యాలు, ఇతర వివరాలన్నింటినీ అధికారులు ఆయనకు వివరించారు. పథకం నిబంధనల ప్రకారం నవంబర్ 30 నాటికి తొలి వాయిదాలో రూ.1560 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ, ఆయన ఆ మొత్తం కట్టలేకపోయారు.
మిస్సింగ్ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, ఐటీ అధికారులు ఆయన ఇళ్లు, కార్యాలయాలన్నింటిలో సోదాలు చేశారు. ఆరోజు రాత్రి 7 గంటల వరకు తనకు ఫోన్లో అందుబాటులో ఉన్నారని, తర్వాత మాత్రం ఆయన ఫోన్ స్విచాఫ్ అయిపోయిందని సమాచారం. పోలీసులు ఎన్నిచోట్ల గాలించినా ఇంతవరకు ఈ మిస్టరీ మాత్రం వీడలేదు. తెర వెనుక రాజకీయ కోణం కూడా ఉందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more