పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఎన్ని అవస్థలు పడుతున్నారో అర్థమైయ్యేలా చేసింది ఈ ఘటన. నిండు చూలాలు కూడా క్యూ లైన్లో నిలబడాల్సి వచ్చింది. నెలలు నిండి క్యూ లైన్లోనే అమె తీవ్ర నో్పులు రావడం అప్పటి వరకు అమెను పట్టించుకోని బ్యాంకు అధికారులు.. చివరకు బ్యాంకును ప్రసూతి కేంద్రంగా మార్చాల్సి వచ్చింది. దీంతో క్యై లైన్లలో నిలబడిని మహిళలు ముందుకోచ్చి నిండు గర్భీణికి ప్రసవం జరిగేలా సాయం చేశారు. ఈ ఘటన కాన్పూర్ ప్రాంతంలోని దేవత్ జిల్లాలో గల పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగింది.
వివరాల్లోకి వెళితే...దేహత్ జిల్లాకు చెందిన సర్వేష (30) తన అత్తతో కలిసి నగదు విత్ డ్రా కోసం జింగ్చక్ ప్రాంతంలో గత పంజాబ్ నేషనల్ బ్యాంకు కు వెళ్లింది. క్యూ లో నిల్చుంది. ఆ రోజు అమెకు డబ్బులు చేతికందకుండానే వెనుదిరిగడంతో మరుసటి రోజున కూడా తన అత్తతో కలసి బ్యాంకుకు వచ్చింది. ఇంతలో సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. అమె పరిస్థితిని గమనించి క్యూలైన్లోని వారు ఆంబులెన్స్కు సమాచారం అందించినా అది రావడం ఆలస్యమైంది. దీంతో అక్కడున్న మహిళలు ఆమెకు అండగా నిలిచారు. వారి సహాయంతో సర్వేష బ్యాంకులోనే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
అప్పటికీ అంబులెన్సు రాకపోవడంతో పోలీసులు తల్లీబిడ్డలను జింగ్చక్ లోని కమ్యూనిటీ అసుప్రతికి తరలించారు. అయితే తన కోడలు చాలా బలహీనంగా ఉండడటంతో తనకు భయమేసిందని సర్వేష అత్తగారు తెలిపింది. కానీ అందమైన పుట్టడం సంతోషంగా ఉందనీ, ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారంటూ ఆనందం వ్యక్తం చేసింది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ లో సర్వేష భర్త అశ్వేంద్ర రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీనితో యూపీ ప్రభుత్వం సుమారు రూ.2.75 లక్షలు, ఇల్లు పరిహార ప్రకటించింది. దీనికి సంబంధించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసుకోవడకోసం అత్తతో కలిసి బ్యాంకుకు వెళ్లింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more