రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఏ పార్టీకైనా ఓటు వేయవచ్చు.. అధికారాన్ని అందించవచ్చు.. కానీ బీజేపికి మాత్రం అధికారాన్ని అందించవద్దని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లను అభ్యర్థించారు. తమ వారికి ముందస్తు సమాచారం అందించి ఆ తరువాత పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వంపై ప్రజలు ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. తాను ఈ మాటలు ఓట్ల కోసమే చెప్పడం లేదని.. అ విషయానికి వస్తే తన పార్టీ అసులు ఉత్తర్ ప్రదేశ్ లోనే పోటీ చేయడం లేదని చెప్పారు.
ఉత్తరప్రదేశ్లో ఓ ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీకి తప్ప ఎవరికైనా ఓటు వేయండంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న యూపీలో ఆయన తొలి ర్యాలీలో పాల్గొన్నారు.ప్రధాని మోదీ తన స్నేహితుల రుణాలను రద్దు చేసి వారికి సాయపడ్డారని కేజ్రీవాల్ విమర్శించారు. అంతేగాక నల్లధనం సర్దుకోవడానికి ప్రధాని వారికి అవకాశమిచ్చారని ఆరోపించారు.
‘ఉత్తరప్రదేశ్ వల్లే మోదీ ప్రధాని అయ్యారు. ఇక్కడ 80 లోక్సభ స్థానాలకు 73 బీజేపీకి ఇచ్చారు. నేను ఓట్లు అడగటానికి ఇక్కడికి రాలేదు. ఓట్ల కోసం అయితే మా పార్టీ పోటీ చేస్తున్న పంజాబ్ లేదా గోవాకు వెళ్లేవాడ్ని. దేశాన్ని కాపాడాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థించడానికి వచ్చాను. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు తనపై కేసులు పెడుతున్నారు. తాను చెబుతున్న నిజాలు కన్న బీజేపి నేతలు చెబుతున్న అబద్దాలను ప్రజలు అధికంగా నమ్ముతున్నారని, ఇందుకు అబద్దాన్ని కూడా పదే పదే చెప్పి నిజంగా ఏమార్చుతున్నారని కేజ్రీవాల్ దుయ్యబట్టారు.
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను తమ అశీర్వదనాలతో దేశం విడిచి పారిపోయేందుకు మోదీ సాయపడ్డారు. మాల్యా బకాయిపడ్డ బ్యాంకు రుణాలను మాఫీ చేశారు. పెద్ద నోట్ల రద్దు విషయాన్ని మోదీ తన స్నేహితులకు ముందే చెప్పారు. దీంతో వాళ్లు నల్లధనాన్ని సర్దుకునేందుకు అవకాశం కల్పించారు. సామాన్యులు మాత్రం డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు, ఏటీఎంల మందు క్యూలో గంటల కొద్దీ నిల్చున్నా నగదు దొరకడం లేదు. మీరు ఏ పార్టీకైనా ఓటు వేయండి. బీజేపీకి మాత్రం వేయకండి’ అని కేజ్రీవాల్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more