అవినీతిపై అలుపెరుగని పోరాటంలో భాగంగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకున్న పాపాన పోవడంలేదు. ఇటు ప్రజల్లో కూడా పెద్ద నోట్ల రద్ద తరువాత ఉత్పన్నమవుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఏటీయంలు, బ్యాంకుల వద్ద క్యూ లైన్లలో నిలబడి అవస్థలు పడుతున్న ప్రజలకు కేంద్ర మరో గుదిబండలాంటి నిర్ణయం శారఘాతంలా పరిణమించింది.
నోట్ల మార్పడితో బ్యాంకుల వద్దకు వెళ్తున్న ప్రజల తాకిడి దేశంలోని అర్బీఐ ఉప కార్యాలయాల్లో వున్న డబ్బే సరిపోక నో క్యాష్ బోర్డులు దర్శమిస్తున్నాయి. ఇటు పలు ప్రవైటు బ్యాంకులు కూడా తమకు అర్భీఐ నుంచి రావాల్సిన డబ్బు అందక అదే తరహాలో డబ్బులు లేవు అన్న బోర్డులు పెడుతున్న తరుణంలో.. ప్రజలకు సరిపడా డబ్బును అందించలేని ప్రభుత్వంపై విమర్శలు, శాపనార్థాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం పలు సవరణ చర్యలను చేపట్టింది.
అయితే ప్రజలకు సరిపడా డబ్బులును ఇవ్వాల్సిన ప్రభుత్వం.. వాటిని జారీ చేయడంలో విఫలం కాగా, ఇటు ఖాతాదారుల విత్ డ్రా పరిమితిలలో కూడా బాగా కుదింపును చేసింది. ప్రస్తుతం వున్న విత్ డ్రా పరిమితులను ఘోరంగా తగ్గించి.. ప్రజల నుంచి భారీ ఎత్తున విమర్శలను ఎదుర్కోంటుంది. వారానికి ఇప్పటివరకూ రూ.24వేలుగా ఉన్న పరిమితి రూ.5వేలకు కుదించినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కరెంట్ ఖాతాదారులకు మాత్రమే రూ.25వేలు డ్రా చేసుకునే వెసులుబాటు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఈ మేరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇవాళ ఈ మేరకు ప్రకటన వెలువడుతుందని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more