అవినీతిపై పోరాటంలో భాగంగా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకన్న చారిత్రక నిర్ణయం పెద్దనోట్ల రద్దుపై బీజేపి పాలిత రాష్ట్రాలు, ఎంపీలు ప్రశంసలు కురిపిస్తున్న తరుణంలో.. పార్టీలోని షాట్ గన్ గా పేరొందిన అసమ్మతి ఎంపీ, మాజీ నటుడు శత్రుఘ్నసిన్హా మాత్రం వారందరికీ భిన్నంగా స్పందించారు. ఏకంగా ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేసుకుని బుల్లట్ల లాంటి విమర్శలు సంధించారు. క్రితం రోజు రాత్రి తన క్యాబినెట్ సమావేశంలో తన నిర్ణయంపై ప్రత్యేక యాప్ ద్వారా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
సుమారుగా ఐదు లక్షల మంది పాల్గోన్న ఈ సర్వేలో నూటికి 93శాతం మంది తమ నిర్ణయానికి మద్దతు పలికారని చెప్పి 12 గంటలు కూడా గడవకముందే శత్రుఘ్న సిన్హా వాటిని టార్గెట్ చేశారు. ప్రధాని సహా బీజేపి నేతలు పిచ్చోళ్ల స్వర్గంలో విహరించవద్దని, భ్రమల్లో బతకొద్దని పరోక్షంగా సూచించారు. నోట్ల రద్దుకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారన్న మోదీ వ్యాఖ్యలను శత్రుఘ్నసిన్హా తప్పుబుడతూ.. ఇలాంటి కల్పిత కథనాలు, కట్టు కథలతో మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామని, అయితే స్వప్రయోజనాల కోసం నిర్వహించిన సర్వేలకు దూరంగా ఉంటేనే అసలు విషయాలు మన దృష్టికి వస్తాయని అన్నారు.
మొబైల్ యాప్ ద్వారా నిర్వహించిన సర్వేలో 93 శాతం మంది పెద్దనోట్ల రద్దుకు మద్దతిచ్చారని, కేవలం 2 శాతం మంది మాత్రమే దాన్ని వ్యతిరేకించారన్నారని ప్రధాని మోదీ బుధవారం వెల్లడించారు. అయితే మోదీ సర్కారు తమకు అనుకూలంగా ఈ సర్వే చేయించుకుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. గ్రామీణ భారతానికి ఈ సర్వేలో ప్రాతినిథ్యం లేదని వ్యాఖ్యానించాయి. గ్రామాల్లో చాలా మందికి స్మార్ట్ ఫోన్లు లేవని తెలిపాయి. తమకు వ్యతిరేకంగా వచ్చిన సమాధానాలను ప్రభుత్వం తొలగించిందని ఆరోపించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more