రెండు రోజుల క్రితం పాక్ చేసిన దుశ్చర్యపై భారత సైన్యం ఇంకా రగిలిపోతూనే ఉంది. మచ్చల్ సెక్టార్ లో ఒక జవాన్ ను కిరాతకంగా ముక్కలుగా నరికి, మరో ఇద్దరిని కాల్చి చంపిన ఘటన తెలిసిందే. అన్న మాట ప్రకారం రంగంలోకి దిగిన ఆర్మీ పాక్పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది.
అమరులైన జవాన్లు మనోజ్ కుమార్ కుశ్వాహ, ప్రభుసింగ్, శశాంక్ కుమార్లకు సైన్యం నివాళులు అర్పించిన కొద్ది గంటల్లోనే పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పాక్ పోస్టులపై భీకర కాల్పులతో పాక్ వెన్నులో వణుకు పుట్టించింది. 2003 తర్వాత నియంత్రణ రేఖ వెంబడి ఈ రేంజ్ లో దాడులు జరగటం ఇదే మొదటిసారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 120 ఎంఎం మోర్టార్లు, మిషన్ గన్లతో పాక్ జవాన్లను బెంబేలెత్తించింది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం భారత్ జరిపిన దాడుల్లో 9 మంది పాక్ జవాన్లు హతమయ్యారని సమాచారం. వీరిలో ఓ కెప్టెన్స్థాయి అధికారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మచ్చల్ దాడికి ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని భారత్ అప్పుడే హెచ్చరించింది. అనుకున్నట్టుగానే పాక్ పోస్టులపై భీకర కాల్పులతో విరుచుకుపడింది.
అయితే భారత్ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, మరో పదకొండు మంది పౌరులు అమరులయ్యారని పాక్ ప్రకటించింది. ఓ బస్సుతోపాటు, అంబులెన్స్ పై భారత దళాలు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపాయని, దాడిలో మోటర్ బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి కూడా మరణించాడని పాక్ అధికార వర్గాలు చెబుతున్నాయి. భారత్ కాల్పులను సమర్థంగా తిప్పికొట్టామని, తమ దాడుల్లో ఏడుగురు భారత సైనికులు మృతి చెందారని పాక్ ప్రకటించింది. తమవైపు నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండానే భారత్ కాల్పులకు పాల్పడిందని ఆరోపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more