పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ సొంతగా ఆవాజ్ ఈ పంజాబ్ పార్టీని స్థాపించుకున్నాడు మాజీ క్రికెట్ర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ. అయితే ఆయన భార్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని వీడేది లేదని ఆ సమయంలో ప్రకటించింది కూడా. కానీ, ఇప్పుడు నవజ్యోత్ కౌర్ పెద్ద షాకే ఇవ్వబోతుంది.
ఈ నెల 28న అధికారికంగా ఆమె కాంగ్రెస్ చేరనున్నట్లు సమాచారం. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరిందర్ సింగ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆవిడతోపాటు మాజీ హాకీ కెప్టెన్, అవాజ్-ఈ-పంజాబ్ లో కీలకనేతగా ఉన్న ప్రగత్ సింగ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారంట. సిధ్దూ వైప్ అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగానే కాదు, ప్రస్తుతం అమృత్ సర్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు.
బీజేపీకి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్, తన భర్త వ్యవస్థాపకుడిగా ఉన్న ఆవాజ్-ఏ-హింద్ ను కాదని మరీ, కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవటం ఆసక్తికరంగా మారింది. ఇక భావ సారూప్యత ఉన్న నవజ్యోత్ వంటి వారిని తమ పార్టీ అక్కున చేర్చుకుంటుందని, వారి రాకతో, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందని అమరిందర్ సింగ్ పేర్కొన్నాడు.
కాగా, జూలైలో బీజేపీ కి గుడ్ బై చెప్పిన సిద్ధూ సెప్టెంబర్ లో ఆవాజ్-ఈ-పంజాబ్ ను పార్టీని పెట్టిన సిద్ధూ, ఆపై ఎన్నికలే తమ లక్ష్యమని ఓసారి, ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని మరోసారి వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు నవజ్యోత్ తరువాత, సిద్ధూ కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా సిద్ధూని లాగి పంజాబ్ ఎన్నికల్లో లాభపడుదామనకున్న ఆప్ కి ఇది పెద్ద షాకే అని చెప్పుకోవాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more