కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం తీసుకున్నసంచలన నిర్ణయంగా పేర్కోంటున్న పెద్దనోట్లను రద్దు కేసులు ఏకంగా సర్వోన్నత న్యాయస్తానానికి చేరాయి. అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం తదితర అంశాల నేపథ్యంలో భారత ఏకానమీపై సర్జికల్ స్ట్రైక్ గా పేర్కోంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తూ న్యాయస్థానాలను అశ్రయించారు. దీంతో దేశవ్యప్తంగా నెలకొన్న గంధరగోళ పరిస్థితిని చక్కదిద్దే బాద్యత ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరింది.
నోట్ల రద్దు అంశంమై దాఖలైన కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా చెలామణిలో ఉన్న కరెన్సీలో 80 శాతాన్ని ఒకేసారి రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కొందరు పిటిషన్లు అభ్యంతరం వ్యక్యం చేయగా, మరికొందరు.. బ్యాంకుల ముందు క్యూ లైన్లలో చనిపోయినవారి తరఫున పిటిషన్లు దాఖలుచేశారు. అయితే నోట్ల రద్దు(డీమానిటైజేషన్)పై దాఖలైన అన్ని కేసులను కొట్టేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరడం, అందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించడం తెలిసిందే.
దేశంలోని వివిధ కోర్టుల్లో దాఖలైన పిటిషన్లు అన్నింటినీ ఒకే చోట ఒకే రోజు విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. బుధవారం (నవంబర్ 23న) సుప్రీంకోర్టులోగానీ, ఏదేనీ హైకోర్టులో గానీ నోట్ల రద్దు పిటిషన్ల విచారణ జరుపుతామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు కేసుల బదలాయింపుకు సంబంధించిన పిటిషన్ ను కేంద్ర అటార్నీ జనరల్ చేతే దాఖలు చేయించింది. ఏజీ రోహత్గీ.. ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ను కలిసిన సంబంధిత పిటిషన్లను అందజేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more