కాపు హక్కుల సాధనే కోసం ఉద్యమిస్తున్న కావు ఐక్యవేదిక ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన సత్యాగ్రహ పాదయాత్రకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రేకులు వేయించింది. కాపు కులస్థులను బీసీలలో చేర్చి.. ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవాళ్టి నుంచి ఆయన సాగించనున్న సత్యాగ్రహ పాదయాత్రలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవుతుందన్న కారణంగా పోలీసులు అయనను హౌజ్ అరెస్టు చేశారు.
ఈ మేరకు ఆయన సత్యాగ్రహ పాదయాత్రపై దాఖలైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటీషన్ దాఖలు కాగా.. దానిపై విచారించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు పచ్చజెండాను ఊపినా.. పోలీసులు బ్రేకులు వేయడంపై తీవ్ర అభ్యంథరాలు వ్యక్తం అవుతున్నాయి. ముద్రగడ సత్యాగ్రహ పాదయాత్ర చేసినంత మాత్రాన శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించినా.. పోలీసులు అయన పాదయాత్రకు సహకరించి ఎలాంటి విఘాతాలు ఏర్పడకుండా చూడాల్సంది పోయి.. ఆయననే గృహనిర్భంధలో చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముద్రగడ పద్మనాభం తూర్పు గోదావరి జిల్లా రావుల పాలెం నుంచి తలపెట్టిన ‘కాపు సత్యాగ్రహ యాత్ర’ ఇవాళ ప్రారంభం కావాల్సివుంది. ఇది ఐదురోజుల పాటు కొనసాగి అంతర్వేదిలో ముగియాల్సి వుందిజ అయితే ఈ నేపథ్యం ఆయన నివాసం చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు. కిర్లంపూడితో పాటు కొనసీమలోనూ భారీగా పోలీసులను మోహరించారు.
ముద్రగడతో పాటు మరికొందరు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, సాధనాల శ్రీనివాస్, ఈవై దాసు, నల్లా విష్ణు, కలవ కొలను తాతాజీ, పవన్ తదితరులను పోలీసులు రావులపాలెంలో అరెస్ట్ చేసి కాకినాడ 3వ టౌన్ పోలీసు స్టేషన్లో నిర్బంధించారు. దీంతో శాంతిపూర్వక వాతవారణానికి ప్రతీకగా వున్న ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పోలీసుల అరెస్టుల నేపథ్యంలో పరిస్థితి మొత్తం నివురుగప్పిన నిప్పులా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more