నోట్లను మార్చేందుకు, డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్న జనాలకు మరో తలనొప్పి ఎదురవుతోంది. అదే ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీ సమర్పించటం. కేవలం ఐడీ మాత్రమే చూపితే చాలన్న ఉద్దేశ్యంతో చాలా మంది వెళ్తుంటే నకలు కాపీ తప్పనిసరి అంటూ సిబ్బంది మెలిక పడుతున్నారు.
అప్పటికప్పుడే బ్యాంకులు వాటిల్లోనే జిరాక్స్ మెషిన్ల సాయంతో కాపీలు అందిస్తున్నప్పటికీ, కొన్ని మాత్రం బయటకు వెళ్లి తెచ్చుకోవాల్సిందేనని తేల్చేస్తున్నాయి. దీంతో అప్పటి వరకు లైన్ లో నిలుచున్న వారు ఉస్సూరు మంటూ దాని జిరాక్స్ కోసం సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. అక్కడ రద్దీ, వాటి కోసం వెళ్లి వచ్చేలోగా లైన్ చాంతాడంత మారిపోవటంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
అయితే ఈ సమస్యకు చెక్ పెడుతూ ఆర్బీఐ ఓ ప్రకటన చేసింది. నోట్లు మార్చుకునేందుకు వెళ్లినవారు గుర్తింపు కోసం కేవలం ఐడీ కార్డులు చూపిస్తే సరిపోతుందని తెలిపింది. నగదు మార్పిడి దరఖాస్తులో పేర్కొన్న నంబర్లు సరైనవా, కాదా అని సరిచూసేందుకు మాత్రమే ఐడీ కార్డు చూపిస్తే సరిపోతుందని పేర్కొంది. ఈ విషయాన్ని ఎస్ బీఐ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు కూడా.
ఇంకుపడుద్ది...
పాత నోట్లు మార్చుకునేందుకు బ్యాంకు వెళ్లే వ్యక్తి కుడి చేతి చూపుడు వేలుకు సిరా మార్కు వేస్తారు. దీని వల్ల అదే వ్యక్తి వేరే బ్యాంకుల్లో మరిన్నిసార్లు నగదు మార్చుకునే వీలు ఉండదు. దీని వల్ల క్యూలైన్లు తగ్గడం, అక్రమపద్ధతుల్లో నగదు మార్పిడికి చెక్ పెట్టడంతోపాటు నగదు అందరికీ సులభంగా అందుతుందని కేంద్రం భావిస్తోంది.
పాత నోట్లను మార్చుకునే విషయంలో ఉన్న లొసుగులను ఆధారం చేసుకుని సాధారణ ప్రజలతోపాటు కొందరు అసాంఘిక శక్తులు సిండికేట్గా మారి.. జనాన్ని కిరాయికి పెట్టి మరీ నోట్లను మార్పిస్తున్నారన్న వార్తల నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more