నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టే నేపథ్యంలో పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నల్లకుబేరులపై ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలియదు కానీ, ప్రజలను మాత్రం నరకయాతన పెడుతుందని కాంగ్రెస్ నాయకురాలు, నటి ఖుష్బూ అన్నారు. నోట్ల రద్దు విషయమై ఆలస్యంగా స్పందించిన అమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మొసలి కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన జనాలు ఆయనను నమ్ముతారా? అని ప్రశ్నించారు. తన నిర్ణయంపై దేశ ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆయన సానుభూతి పొందేక్రమాన్ని అశ్రయించారని దుయ్యబట్టారు.
మోదీ విధానాలతో దేశ ప్రజలంతా ఎన్నో కష్టాలు ఎదుర్కుంటున్నారని, వారి ఇబ్బందులను ప్రధాని అర్థం చేసుకోవాలని ఖుష్బూ వ్యాఖ్యానించారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకోవడానికి ప్రధాని మోదీ ఏటీఎం సెంటర్ల వద్దకు వెళ్లాలని ఆమె సూచించారు. అవినీతిపై పోరు అంటూ ముందుచూపు లేకుండా ప్రధాని తీసుకున్న నిర్ణయం ప్రజలకు శాపంగా మారిందన్నారు. పెద్ద నోట్ల రద్దు చేసేముందు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మోదీపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆమె అన్నారు.
డబ్బులు అవసరమున్న ప్రతీ ఒక్కరు ఏటీఎంల కేంద్రాలకు చేరుకుని, తమ అవకాశం కోసం వేచిచూస్తున్న క్రమంలో అక్కడ తోపులాట, ఘర్షణలు కూడా జరుగుతుందని పేర్కొన్నారు. తాము కష్టపడి అర్జించిన సోమ్మపై ప్రభుత్వం అన్ని విధాలా పన్నులు కట్టించుకున్నాక.. కూడా తమ జేబుల్లోకి అవి వచ్చి చేరేందుకు మరోసారి ప్రయాసపడాల్సి వస్తుందని ప్రజలు అవస్థ పడుతున్నారని అన్నారు. ప్రజలు పడుతున్న కష్టాలకు మోదీదే బాధ్యత అని వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more