ప్రపంచదేశాల దృష్టిలో పరువు పోయే మరో వార్త ఇప్పుడు పాకిస్థాన్ కు కుదిపేస్తోంది. ప్రస్తుతం ఆడాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో... ఆ దేశంలో హిజ్రాలను కూడా వదలకుండా అఘాయిత్యాలకు పాల్పడటం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కొన్నాళ్ల క్రితం విడుదలైన ఓ వీడియోలో ఓ హిజ్రాను ఓ వ్యక్తి తోలు బెల్టుతో కసితీరా బాదటం, కట్టేసి కాలితో తంతూ చితకబాదటం, అడొచ్చిన తోటి హిజ్రాను నెట్టేయటం.. వెరసి ఆ వీడియో సంచలనం సృష్టించింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే పది మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కేసు విచారణలో ఉండగానే విస్తూ పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారంతా ఆ హిజ్రాలను అమ్మడానికి ప్రయత్నించటమేకాదు, ఏకంగా అత్యాచారాలు కూడా చేస్తున్నారంట.
ఆ దాడిని అతి దగ్గరగా చూసిన మరో హిజ్రా చెబుతున్న విషయాల ప్రకారం... ‘‘ఆ గ్యాంగ్ లీడర్ అయిన జజ్జా హిజ్రాను ముందుగా భాదితుడిని/రాలిని అందరి ముందు కట్టేసి కొట్టడం ప్రారంభించాడంట. ఆపై మరో హిజ్రా ఓ ఇంట్లోకి తీసుకెళ్లి ఇలా తన్నటం మొదలుపెట్టాడు. అక్కడ చాలా మంది హిజ్రాలు కూడా ఉన్నారంట. ఈ విషయాలను ఘటనా స్థలంలోనే ఉన్న జోలి అనే హిజ్రా ఓ ఇంటర్వ్యూలో చెప్పకొచ్చింది/చ్చాడు. అక్కడ హిజ్రాలను విపరీతంగా కొట్టడం, గుండ్లు గీయటం, అత్యాచారాలు చేయటం లాంటి వాటితో ఆ ప్రాంతమంతా నరకప్రాయంగా ఉందని తెలిపింది. అంతేకాదు చివరికి వారి మూత్రం తాగమంటూ వేధించారంట కూడా.
పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు సియాల్ కోట్ ప్రాంతంలో ప్రధాన నిందితుడు జజ్జాతోపాటు మరో పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనిపై జజ్జా ఏం చెబుతున్నాడంటే.. చెడు అలవాట్లు మానుకోలేకపోతున్నాడనే ఆ హిజ్రాను అలా కొట్టానని పోలీస్ విచారణలో తెలిపాడు.
కాగా, పాకిస్థాన్ లో హిజ్రాలకు అస్సలు భద్రత లేదని పలు స్వచ్ఛంధ సంస్థలు చెబుతున్నాయి. అడ్డుకోవటం, డాన్సులు చేయటం, వ్యభిచారం చేయాలంటూ హిజ్రాలపై అక్కడ అడపా దడపా దాడులు జరుగుతూనే ఉంటాయని వారంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more