పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటం, ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందంటూ విమర్శలు రావటం తెలిసిందే. మరోవైపు గత నాలుగు రోజులుగా ప్రజలు నోట్ల మార్పిడి, చిల్లర, చేతిలో సరిపడా కరెన్సీ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఊరట కలిగిస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు.
ఆర్బీఐ తో సంప్రదించి మనీ విత్ డ్రా పరిమితుల్లో మార్పులు చేసింది. పాత నోట్ల మార్పిడి పరిమితిని రూ.4 వేల నుంచి రూ.4500 కు పెంచింది. ఇక రోజుకు రూ.10 వేలు మాత్రమే విత్ డ్రా నిబంధనను ఉపసంహరించుకుంది. వారానికి విత్ డ్రా పరిమితిని రూ.20 వేల నుంచి రూ.24 వేలకు పెంచింది. ఏటీఎంలో విత్ డ్రా పరిమితిని రూ.500 పెంచడంతో రోజుకు రూ.2500 విత్ డ్రా చేసుకోవచ్చు. మరోవైపు ప్రదాన పట్టణాలలో 500 రూపాయల నోట్లు ఇప్పటికే విడుదల కాగా, రేపటి నుంచి దాదాపు దేశం మొత్తం అందుబాటులోకి రావచ్చొనే సంకేతాలు అందుతున్నాయి.
మరోవైపు సరైన కారణం చూపించి రూ.50వేల వరకూ నగదును విత్ డ్రా చేసుకునేలా కేంద్రం నిర్ణయం తీసుకుందదని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ కాసేపటి క్రితం మీడియా సమావేశంలో వెల్లడించారు. అంతేకాదు.. బ్యాంకులో రోజుకు ఎన్నిసార్లు అయినా నగదు జమ చేసుకోవచ్చని.. దీనికి ఎలాంటి పరిమితి లేదన్న ఆయన.. రూ.2.5లక్షలు దాటితే మాత్రం ఆధారాలు చూపించాలని స్పష్టం చేశారు.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలకు కాస్త ఊరట కలిగించినట్లయ్యింది. అయితే సవరించబడిన కొత్త నిబంధనలు సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన ఏటీఎంలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పటం, సోమవారం బ్యాంకులకు హాలీడే కావటంతో మరో రెండు రోజులు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉంది.
పాత నోట్లకు గడుపు పెంపు...
మరోవైపు పాత రూ.500, వెయ్యి రూపాయల నోట్ల వినియోగాన్ని 10 రోజుల పాటు కేంద్రం పొడిగించింది. ముందుగా 14వ తేదీ వరకే వాటి వాలిడిటీ ఉంటుందని చెప్పినప్పటికీ, ప్రజల నుంచి వస్తున్న విజ్నప్తుల నేపథ్యంలో అవి చెల్లుబాటు అయ్యేలా ఈ నెల 24 వరకు తేదీని మార్చింది.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోలు బంకులు, ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వే, బస్సు టికెట్లు, ఎయిుర్ పోర్టుల్లోని కౌంటర్లలో విమాన టికెట్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఫార్మసీల్లో మందుల కొనుగోలు, ఎల్పీజీ సిలిండర్లు, రైల్వే కేటరింగ్, టోల్ గేట్లు నవంబర్ 24 అర్ధరాత్రి వరకు పాత నోట్లు చెల్లుబాటవుతాయి.
అంతేకాదు మున్సిపాలిటీ, స్థానిక సంస్థల పన్నులు చెల్లించవచ్చు. కొత్త కరెన్సీ ప్రజలందరికీ అందుబాటులోకి రావటానికి ఈ సమయం సరిపోతుందని కేంద్రం భావిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more