ఇప్పటికే పూర్తి స్వదేశీ సాంకేతిక సహకారంలో క్రయోజెనిక్ ఇంజన్ వినియోగంతో సరికోత్త అద్యాయాలను తన పేరున లిఖించుకుంటూ ముందుకు సాగుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ(ఇస్రో) మరో కొత్త చరిత్రను సృష్టించేందుకు రంగం సిద్దం చేసింది. ఇప్పటి వరకు ఏ దేశం చేయని అరుదైన కార్యానికి ఇస్రో నడుం చుట్టింది. ఒకే సారి శాటిలైట్ లాంచ్ వెహికిల్ ద్వారా 82 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు సమాయత్తం అవుతుంది. వచ్చే ఏడాది జనవరి 15న ఈ ప్రయోగం చేయనున్నట్లు మార్స్ ఆర్బిటార్ మిషన్(మామ్) ప్రాజెక్టు డైరెక్టర్ సుబ్బయ్య అరుణన్ తెలిపారు.
ప్రపంచ దేశాలలో ఇప్పటివరకూ కేవలం రష్యా మాత్రమే 37 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి పంపి ఒకసారి ప్రయోగం ద్వారా అత్యదిక ఉపగ్రహాలను నింగిలోకి పంపిన చరిత్రను తన పేరున లిఖించుకోగా, తాజాగా ఇస్రో దానిని బద్దలు కోట్టి.. తన పేరున నూతన అద్యాయం లిఖించుకునేందుకు సిద్దమైంది. రష్యా 2014లో 37 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపగా. అంతకుముందు అమెరికా 29 ఉపగ్రహాలను పంపింది. అయితే గతంలో ఒక ప్రయోగంలోనే 20 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో.. ఈ సారి ఏకంగా 82 ఉపగ్రహాలను పంపేందుకు సన్నధం అవుతుంది.
ఇప్పటికే ఎన్నో ఘనవిజయాలను అందించిన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(పీఎస్ఎల్వీ)తో ఈ ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ప్రయోగం జరిగిన 20 నుంచి 25 నిమిషాల్లో 580కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలార్ సన్ సింక్రనస్ కక్ష్యలో 82 శాటిలైట్లను ప్రవేశపెట్టేంత వరకు దానిని అక్కడే అగేలా చేయడమే తమకు ఈ ప్రయోగంలో ఏర్పడనున్న ప్రధాన సవాల్ మామ్ ప్రయోగపరిశోధన డైరెక్టర్ గా వ్యవహరించిన సుబయ్య అరుణన్ చెప్పారు. ఆ తరువాత 2020లో మామ్-2ను ప్రయోగించాలని నిర్ణయించినట్లు అరుణన్ వెల్లడించారు. అరుణ గ్రహంపై పరిశోధనలకు ఇప్పటివరకూ 40 ప్రపోజల్స్ వచ్చినట్లు చెప్పారు. చంద్రయాన్-2 2018లో చంద్రునిపై దిగుతుందని తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే పరిశోధనలు ప్రారంభమైనట్లు వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more