నాగరికత సమాజంలో అనాగరిక పోకడలకు పోతూ.. కులవృత్తుల సాక్షిగా వెలసిన కులాలనే ప్రమాణికాలుగా చేసకుంటూ.. ఇప్పటికే రాజకీయ నాయకులు వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. అయితే చిన్న పిల్లలోనూ ఈ విషబీజాలు నాటి.. వారి చిన్నారి మనస్సులను కూడా కలుషితం చేస్తున్నారు. నువ్వు దళితుడివి, నువ్వు అధికంగా మార్కులు తెచ్చుకోకూడదు అంటూ బీహార్ లో ఓ దళిత విద్యార్థిని అతని తరగతి గదికే చెందిన ఇద్దరు అన్నదమ్ములు దారుణంగా చితకబాదడం సమాజాన్ని వెక్కిరిస్తూ ప్రశ్నిస్తుంది. సభ్య సమాజంలో మనం ఎక్కడికి వెళ్తున్నామని వేలెత్తి చూపుతుంది.
బీహర్ లోని ముజఫర్ పూర్ లోని కేంద్రీయ విద్యాలయంలో తనను గ్యాంగ్ స్టర్ కోడుకులు విక్కీ, విశాల్ ఎందుకు చితక్కోట్టారన్న విషయన్ని.. దెబ్బలు తిన్న బాలుడు ఉత్తమ్ కుమార్ వెల్లడించాడు. కేంద్రీయ విద్యాలయలో చదువుతున్న తనను అకారణంగా విక్కీ, విశాల్ లు తమ స్నేహితులతో కలసి చావచితక్కోట్టారని గతంలో చెప్పిన ఉత్తమ్ కుమార్.. తనను వారు కొట్టడానికి తాను చదువులో బాగా రాణించడమే కారణమని చెప్పాడు. తనకు అధిక మార్కులు రావడం జీర్ణంచుకోలేని వారు తనను తరగతి గదిలోనే మరికొందరు విద్యార్థులు చూస్తుండగా దారుణంగా కొట్టారన్నారు.
తాను ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే చంపుతామని కూడా వారు బెదిరించారని చెప్పాడు. గతంలోనూ తనపై అకారణంగా వారు దాడి చేసినట్లు చెప్పాడు. తనను పరీక్షలు కూడా రాయకుండా అడ్డుకుంటామని బెదిరించడంతో తాను ఈ విషయాన్ని ఎవరకీ చెప్పలేదని ఉత్తమ్ కుమార్ చెప్పాడు. కాగా అగస్టు 25 జరిగిన ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. ఇన్నాళ్లుగా గోప్యంగా వుంచడంపై స్థానిక పాఠశాల యాజమాన్యాంపై కేంద్ర మానవవనరులు శాఖ చర్యలు తీసుకుంది.
దళిత విద్యార్థిని చితకబాదిన ఘటనలో మొత్తం 15 మందిపై కేంద్ర మానవ వనురుల మంత్రిత్వ శాఖ వేటు వేసింది. కేంద్రీయ విద్యాలయ పాఠశాల ప్రిన్సిపల్ ను సస్సెండ్ చేశామని, కాగా, ఉప ప్రధానోపాధ్యాయుడితో పాటు 14 మంది ఉపాధ్యాయులపై కూడా బదిలీ వేటు వేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ తన ట్విట్టర్ లో తెలిపారు. బీహర్ ముజాఫర్ పూర్ కేవీ పాఠశాలలో జరిగిన ఘటనపై కఠిన చర్యలు తీసుకున్నట్లు అయన పేర్కోన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more