తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో గత 21 రోజులుగా చెన్నూలోని అపోలో అస్పత్రిలో చికిత్స పోందుతున్న నేపథ్యంలో అమె అరోగ్యం విషయమై ఇంకా పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ వీడటం లేదు. అభిమానులకు ఇంకా సస్సెన్స్ వీడటం లేదు. అమెకు అవసరమైన చికిత్స కొనసాగిస్తున్నామని, అమెకు సీనియర్ న్యూట్రీషన్ అధ్వర్యంలోని డైట్ ను కూడా అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నా.. అభిమానులకు మాత్రం సస్పెన్స్ వీడటం లేదు. ఆమె ఆస్పత్రిలో చేరి ఇవాళ్టికి 21 రోజులు అయింది. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింతగా పెరుగుతుంది.
లండన్, ఎయిమ్స్ వైద్యుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి చికిత్స అందిస్తున్నామని అపోలో అస్పత్రి వైద్యులు చెబుతున్నారు. జయలలిత ఆరోగ్యంపై వదంతులు నమ్మవద్దని, త్వరలోనే ఆమె క్షేమంగా ఇంటికి చేరుకుంటారని వైద్యులు అంటున్నారు. ఆమెను పరామర్శించిన పలువురు ప్రముఖులు కూడా ఇదే మాట చెబుతున్నారు. అయితే అమెను పరామర్శించడానికి వచ్చిన ఏ ఒక్కరిని అమె వున్న వార్డుకు పంపించేందుకు వైద్యులు అనుమతించడం లేదు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా వార్డు అద్దం నుంచే అమెను చూసి వెనుదిరిగారని సమాచారం, కాగా అమెను ఇవాళ అపోలో అస్పత్రికి వెళ్లి పరామర్శించిన మాజీ కాంగ్రెస్ ఎంపీ కృష్ణస్వామి అమె వేగంగా కోలుకుంటున్నారని, వైద్యుల చికిత్సకు ఆమె సానుకూలంగా స్పందిస్తున్నారని చెప్పారు
అయితే అభిమానులు మాత్రం ‘అమ్మ’ ఆరోగ్యంపై కలత చెందుతున్నారు. ఆమె కోలుకోవాలంటూ పూజలు చేస్తున్నారు. మరోవైపు విపక్షాలు మాత్రం ఆరోపణలు గుప్పిస్తున్నాయి. జయలలిత ఆస్పత్రిలో చేరడంతో రాష్ట్రంలో పాలన స్తంభించిందని ఆరోపిస్తున్నారు. తాత్కాలిక సీఎంను నియమించి పాలనపై దృష్టిసారించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను ఏఐఏడీఎంకే నేతలు ఖండిస్తున్నారు. పరిపాలన సజావుగా సాగుతోందని, చౌకబారు ఆరోపణలు మానుకోవాలని చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more